నిధులొచ్చాయ్.. పనులే తరువాయి
పార్వతీపురం డివిజనులో రహదారులు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. గతుకుల మయమైన రహదారులపై వాహనాలు తిప్పడానికి చోదకులు సుడిమడతలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది.
గుత్తేదారుల్లో కదలిక
కూనేరు-పార్వతీపురం రోడ్డు నాణ్యత పనులు పరిశీలిస్తున్న నాగమోహన్
పార్వతీపురం, న్యూస్టుడే: పార్వతీపురం డివిజనులో రహదారులు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారు. గతుకుల మయమైన రహదారులపై వాహనాలు తిప్పడానికి చోదకులు సుడిమడతలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది. రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు ఏడాది కిందటే నిధులు మంజూరైనప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు.
దాని ఊసే లేదు
తారురోడ్లకు ప్రతి ఐదేళ్లకోసారి పునర్నవీకరణ పూత(రెన్యువల్కోట్) వేయాలి. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియను పాటించకపోవడంతో గతుకుల మయంగా మారిపోయాయి. తారు రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోతుండడంతో గోతులు విస్తరించాయి. వీటిని పూడ్చేందుకు నిధులు లేక, తాత్కాలికంగా చేపట్టిన చర్యలు ఫలితం ఇవ్వలేదు. బీ మరోపక్క రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా రెండువైపుల బెర్మ్లు ఉంటాయి. వ్యాపార సంస్థలు, పెట్రోలు బంకులు వంటివి ఉన్నచోట బెర్మ్లు ఎత్తుచేసి వాహనాల రాకపోకలకు అనువుగా మలచుకుంటున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు పాడవుతున్నాయని ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు.
అయినా వెనకడుగే..
* పార్వతీపురం డివిజనులోని రాష్ట్రస్థాయి ప్రధాన రహదారులు, జిల్లాస్థాయి ప్రధాన రోడ్ల మరమ్మతులకు గతేడాది ర.భ.శా నిధులు మంజూరుచేసింది. స్టేట్హైవే సమయానుకూలంగా నిర్వహించే పనులు చేపట్టడానికి రూ.38 కోట్లు వచ్చాయి. ఈ మొత్తంతో 126.6 కి.మీ రహదారిని మెరుగుపరచాలని ప్రతిపాదించారు. పనుల నిర్వహణకు టెండర్లను గత జూన్లో ఆహ్వానించి, ఏజెన్సీలను ఖరారు చేసినప్పటికీ సంబంధిత శాఖతో ఒప్పందాలు రాసుకోడానికి గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు.
* జిల్లాస్థాయి ప్రధాన రహదారుల మరమ్మతులకు రూ.38.59 కోట్లు మంజూరు అయ్యాయి. వీటితో 27 రోడ్లపై 189.63 కి.మీ పొడవున మరమ్మతులు చేయాలి. ఇందులో 17 రహదారుల పనులు ఇంకా ప్రారంభించలేదు. ఒక పని మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగిలిన వాటిలో పునఃటెండర్లు పిలవాల్సినవి కూడా ఉన్నాయి.
త్వరలోనే ప్రారంభిస్తాం: గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు వచ్చారు. త్వరలోనే ఒప్పందాలు కుదుర్చుకుని, ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కూనేరు రోడ్డు పనులు జరుగుతున్నాయి. మిగిలినవి ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తాం. - నాగమోహన్, కార్యనిర్వాహక ఇంజినీరు, ర.భ.శాఖ. పార్వతీపురం డివిజన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.