రెండు..పరిధి మెండు
కొత్త జిల్లాల ఏర్పాటు ఓ కొలిక్కి రాగా.. విజయనగరం రెండుగా విడిపోనుంది. అందరూ ఊహించినట్టే పార్వతీపురం జిల్లా కేంద్రంగా అవతరించనుంది. ఏ జిల్లా పరిధిలోకి ఏఏ మండలాలు వెళ్తున్నాయనే దానిపై కూడా ఓ స్పష్టత వచ్చింది. శ్రీకాకుళంలోని పాలకొండ, రాజాం నియోజకవర్గాలు కలవడంతో రెండు జిల్లాల వి
కొత్త జిల్లాల ఏర్పాటు ఓ కొలిక్కి రాగా.. విజయనగరం రెండుగా విడిపోనుంది. అందరూ ఊహించినట్టే పార్వతీపురం జిల్లా కేంద్రంగా అవతరించనుంది. ఏ జిల్లా పరిధిలోకి ఏఏ మండలాలు వెళ్తున్నాయనే దానిపై కూడా ఓ స్పష్టత వచ్చింది. శ్రీకాకుళంలోని పాలకొండ, రాజాం నియోజకవర్గాలు కలవడంతో రెండు జిల్లాల విస్తీర్ణం పెరగనుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న చీపురుపల్లి డివిజన్ కేంద్రం కాకపోవడంపై అందరూ నిరాశలో ఉన్నారు. -ఈనాడు, విజయనగరం, న్యూస్టుడే, పార్వతీపురం
చీపురుపల్లికి అవకాశం లేనట్టేనా?
విజయనగరం, బొబ్బిలిని రెవెన్యూ డివిజన్లు చేయనున్నారు. చీపురుపల్లిని కూడా చేయాలనే డిమాండ్ 41 ఏళ్లుగా ఉంది. ప్రభుత్వం 1981లో చీపురుపల్లికి ఆర్ఈసీఎస్ (రెస్కో) లేదా రెవెన్యూ డివిజన్ కావాలా అని అడిగింది. అప్పటి ప్రజాప్రతినిధులు రెస్కోకే మొగ్గు చూపారు. 1995 ఆగస్టు 19న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చీపురుపల్లి వచ్చినప్పుడు ప్రకటన చేసినా అమలుకు నోచుకోలేదు. 2003 సెప్టెంబరు 6న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రకటన చేయడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కార్యకలాపాల నిర్వహణకు భవనాలు కూడా పరిశీలించారు. తర్వాత ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడంతో మరుగున పడింది. ఐదేళ్ల కిందట రాష్ట్రంలో 18 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అందులో బొబ్బిలి, చీపురుపల్లి ఉన్నా పట్టాలెక్కలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ అవకాశం బొబ్బిలికి వచ్చింది.
పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇందులో కలిపారు. రెండు ప్రాంతాల్లోని గిరిజనుల సంస్కృతుల్లో సారూప్యత ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో నాలుగు ఐటీడీఏలు ఉన్నాయి. ఇందులో రెండు పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో, పార్వతీపురం, సీతంపేట మన్యం జిల్లాలోకి రానున్నాయి. సాధారణంగా జిల్లాకు ఒక ఐటీడీఏ ఉంటుంది. ఇప్పుడు రెండింటిని ఒకటి చేస్తారా.. ఒకవేళ అదే జరిగితే సీతంపేటను కొనసాగిస్తారా.. పార్వతీపురానికి మారుస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఉన్నందున.. సీతంపేటను ఐటీడీఏగా కొనసాగించాలనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగు నియోజకవర్గాలు రిజర్వుడే కావడంతో ఇతర సామాజిక వర్గాలు రాజకీయాధికారంపై ఆందోళన చెందుతున్నాయి.
నిర్మాణంలో ఉన్న ఐటీడీఏ కార్యాలయం, కలెక్టరేట్ ఇక్కడే ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన
* పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయానికి ఆధునిక హంగులతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోనే మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలనేది అధికారుల ఆలోచన. గతంలో అధికారులు దీన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో ప్రస్తుతం నిర్మాణం నిలిచిపోయింది. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయనే నేపథ్యంలో అప్పటికి భవనం పూర్తి కావడం అనుమానమే.
* జిల్లా పోలీసు శాఖ కోసం వైకేఎం కాలనీలోని యువ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇందులో జిల్లా కీటకజనిత వ్యాధుల నివారణాధికారి కార్యాలయం, గోదాములు ఉన్నాయి. గృహ నిర్మాణ సంస్థకు చెందిన ఇనుము, సిమెంటు వంటివి భద్రపరుస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ సామగ్రి కూడా ఇక్కడే ఉంది.
* జిల్లా న్యాయస్థానానికి అవసరమైన వసతులు, వనరులు అందుబాటులో ఉన్నాయి. కొత్త భవనం నిర్మించడం, ఇక్కడే అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టు కూడా నడుస్తుండడం కలిసొచ్చే అంశాలు.
తగ్గిన విజయనగరం
విశాఖ జిల్లాలోని గజపతినగరం, ఎస్.కోట, భోగాపురం తాలూకాలు, శ్రీకాకుళం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లి తాలూకాలు కలిపి 1979 జూన్ 1న విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 34 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో మండలాల సంఖ్య 26కు తగ్గనుంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాలు మన్యం జిల్లాలోకి వెళ్తుండగా.. కొత్తగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండలాలు చేరనున్నాయి.
ఇతర శాఖల మాటేమిటి?
పార్వతీపురం డివిజన్ కేంద్రమే అయినా విద్యా శాఖ, తూనికలు కొలతల శాఖ కార్యాలయాలు బొబ్బిలిలో నడుస్తున్నాయి. అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా సముదాయాన్ని నిర్మించడానికి ఐదెకరాల స్థలాన్ని గుర్తించాలని గత కలెక్టర్ హరిజవహర్లాల్ ఆదేశించారు. ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం కొత్త శాఖల కోసం అద్దె భవనాలు చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్