logo

ఉద్యోగుల పోరాటానికి ప్రజాసంఘాల మద్దతు

ఉద్యోగులు చేపడుతున్న వేతన సవరణ పోరాటానికి సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులంతా సంపూర్ణ మద్దతు.....

Updated : 27 Jan 2022 16:54 IST

బలిజిపేట: ఉద్యోగులు చేపడుతున్న వేతన సవరణ పోరాటానికి సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సీపీఎం మండల కార్యదర్శి మన్మథరావు తెలిపారు. బలిజిపేట సీఐటీయూ కార్యాలయంలో గురువారం పీఆర్సీ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ కరపత్రాలు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష జీవోలను తెచ్చి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తోందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అప్పారావు, సురేంద్ర, సింహాచలం, భాస్కర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని