చెత్త చిక్కులు
చెత్త.. ఇదో పరిష్కారం దొరకని సమస్యగా మారుతోంది. ప్రణాళికా లోపం.. నిధుల కొరత.. నిర్వహణ లేమి కారణంగా కొత్త చిక్కులు వస్తున్నాయి. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘాలను
పురాలకు భారంగా వాహనాల నిర్వహణ
విజయనగరం దాసన్నపేటలోని ట్రాన్సఫర్ స్టేషన్ వద్ద చెత్తను లారీలో పోస్తున్న దృశ్యం
ఈనాడు - విజయనగరం, విజయనగరం పట్టణం, న్యూస్టుడే చెత్త.. ఇదో పరిష్కారం దొరకని సమస్యగా మారుతోంది. ప్రణాళికా లోపం.. నిధుల కొరత.. నిర్వహణ లేమి కారణంగా కొత్త చిక్కులు వస్తున్నాయి. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘాలను ఎంపిక చేసి చెత్త సేకరణ, తరలింపునకు వాహనాలు అందించారు. వాటి నిర్వహణకు ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పగా గతేడాది నవంబరు నుంచి ప్రారంభించారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. డబ్బులు కట్టిన వారికి వెంటనే రశీదు ఇవ్వడం లేదు. తర్వాత చరవాణికి సంక్షిప్త సందేశం పంపిస్తున్నారు. కొందరికి అదీ రావడం లేదు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ-పోస్ యంత్రాలను వినియోగించాలని భావిస్తున్నారు. ఇందుకు అధికారులు ఇండెంట్ పెట్టారు.
గాలికి వదిలేసినట్టేనా?
రెండు పట్టణాల్లో చెత్త నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. వాహనాలతో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులో కలిపేస్తున్నారు. ఇంటింటికీ సుమారు 1.98 లక్షల ప్లాస్టిక్ బుట్టలు పంపిణీ చేశారు. విజయనగరంలో నాలుగు గార్బేజ్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఒక్కో దానికి రూ.80 లక్షలు కేటాయించారు. ఇప్పటికి ఒక్కటీ పూర్తి కాలేదు.
సాధారణ నిధులకు ఎసరు
ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు కాకపోవడంతో వాహనాల నిర్వహణ మొత్తాలను సాధారణ నిధుల నుంచి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరంలో ఏడాదికి సుమారు రూ.34 కోట్ల సాధారణ నిధులు ఉంటుండగా.. ఇందులో సుమారు రూ.32 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారు. పార్వతీపురంలో రూ.4.50 కోట్ల వరకు ఉండగా.. రూ.3.50 నుంచి రూ.4 కోట్ల వరకు వెచ్చిస్తుంటారు. ఇలాంటప్పుడు చెత్త బళ్లకు నిర్వహణ బిల్లులు ఎలా సమకూర్చాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఎందుకు కట్టాలి..
గతంలో మాదిరిగానే చెత్త సేకరిస్తున్నారు. ఎలాంటి మార్పు లేదు. అలాంటప్పుడు ఎందుకు పన్ను కట్టాలి. దీనిపై పారిశుద్ధ్య సిబ్బందితో ప్రతి నెలా గొడవలు జరుగుతున్నాయి.
- బుగత రమాదేవి, మద్దాలవారి వీధి, పార్వతీపురం
పింఛను నుంచి తీసుకున్నారు..
మా కుటుంబ సభ్యులు చిన్నచిన్న పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మాలాంటి పేద వారిని కూడా చెత్త పన్ను కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చేది. డబ్బులు ఇవ్వకపోతే నాకొచ్చే సామాజిక పింఛను నుంచి మినహాయించుకొని ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం.- కర్రోతు రమణ, ముచ్చెరువు గట్టు, విజయనగరం
తలకు మించిన భారం
* విజయనగరానికి 63 వాహనాలు వచ్చాయి. ఒక్కో దానికి నెలకు రూ. 64,500 చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 4.87 కోట్ల భారం నగరపాలక సంస్థపై పడుతోంది. దీంతో ప్రస్తుతం తొమ్మిది వాహనాలు పక్కన పెట్టేశారు. మిగిలిన వాటితో పాటు గతంలో ఉన్న వాహనాలకు కలిపి 46 వరకు ఉన్నాయి. వీటికి నెలకు డీజిల్కు రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతోంది.
* పార్వతీపురంలో 16 వాహనాలు ఉండగా ఒక్కో దానికి నెలకు రూ. 62 వేల చొప్పున చెల్లించాలి. ఏడాదికి రూ.1.19 కోట్లు అవుతుంది. ఈ భారంతో ఐదు వాహనాలను పక్కన పెట్టేశారు. గతంలో అన్నీ కలిపి ఎనిమిది వాహనాలు ఉండగా.. ఒక్కో దానికి డీజిల్, జీతాలు, నిర్వహణ ఖర్చులు రూ.35 వేల వరకు అయ్యేవి. ఏడాదికి సుమారు రూ.33.60 లక్షలతో సరిపోయేది.
ప్రజలు సహకరించాలి
పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ప్రజలు అధికారులకు సహకరించాలి. పన్ను చెల్లిస్తే నిర్వహణ సమర్ధంగా చేయొచ్చు. త్వరలో సచివాలయ కార్యదర్శులకు ఈపోస్ యంత్రాలు అందిస్తాం. వెంటనే రశీదు ఇస్తారు. పన్ను వసూలు పెంచి వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రజలకు అవగాహన కల్పిస్తాం. - సీహెచ్వీవీఎస్ బాపిరాజు, ప్రాంతీయ సంచాలకుడు, విశాఖ రీజియన్
విజయనగరంలో
*నవంబరులో 61.93 శాతం పన్ను వసూలు కాగా.. మార్చిలో 8.01 శాతమే వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పార్వతీపురంలో
* నవంబరులో 76.03 శాతం, మార్చిలో 18.45 శాతం వసూలైంది. దీంతో గతంలో సచివాలయ సిబ్బందికి వార్డుల వారీగా లక్ష్యాలను విధించారు. వాటిని చేరుకోకపోతే విధుల నుంచి తప్పిస్తామని ఉత్తర్వులు కూడా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగ్గురి పాలిట మృత్యువు
[ 29-03-2024]
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. -
ఇదేం బాదుడు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. -
మీ ఓటు పదిలమేనా..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. -
గంటన్నర ముందే మాక్ పోలింగ్
[ 29-03-2024]
పోలింగ్ రోజున గంటన్నర (90 నిమిషాలు) ముందు.. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి, ఓటర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. -
ఎస్.కోట నుంచే 40 వేల మెజార్టీ
[ 29-03-2024]
ఎస్.కోట పట్టణంలో గాయత్రీ ఆలయం వెనుక తెదేపా కార్యాలయాన్ని విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ గురువారం ప్రారంభిచారు. ఎస్.కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన -
ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగంలో సిబ్బందిపై కచ్చితమైన ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనరు ఎం.మల్లయ్యనాయుడు ‘న్యూస్టుడే’కు తెలిపారు. -
సహకారం కరవు
[ 29-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. -
అక్కడ సమస్యలనే చదవాలి!!
[ 29-03-2024]
వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. -
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా