పెట్రోలు, డీజిల్కు కోత
ఉమ్మడి జిల్లాల్లో ఓ ప్రధాన ఆయిల్ కంపెనీకి చెందిన కొన్ని బంకుల్లో గురువారం రాత్రి నుంచే పెట్రోలు, డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే సదరు కంపెనీ ఐదు జిల్లాలకు చమురు సరఫరా చేసే డిపోను గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవలేదు.
బంకుల్లో నిండుకుంటున్న నిల్వలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాల్లో ఓ ప్రధాన ఆయిల్ కంపెనీకి చెందిన కొన్ని బంకుల్లో గురువారం రాత్రి నుంచే పెట్రోలు, డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే సదరు కంపెనీ ఐదు జిల్లాలకు చమురు సరఫరా చేసే డిపోను గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవలేదు. తర్వాత తెరిచి కంపెనీ సొంత అవుట్లెట్లకు మాత్రమే 25-30 వరకు లోడులు పంపినట్లు తెలిసింది. తర్వాత డీలర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఒక్కో జిల్లాకు కేవలం 5-6 లోడుల చొప్పున సరఫరా చేసింది. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాలకు కనీసం ఒక్క లోడు కూడా రాలేదు. ముందు రోజు డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరా చేయలేదని ఓ పెట్రోలు బంకు యజమాని ‘న్యూస్టుడే’కు తెలిపారు. గురువారం రాత్రికో, శుక్రవారం ఉదయానికో తమ వద్దనున్న నిల్వలు పూర్తిగా నిండుకుంటాయని వివరించారు.
తెరపైకి రేషన్ విధానం
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 147 వరకు వివిధ బంకులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం సరఫరా ఆగిన సదరు కంపెనీ బంకులు 32 వరకు ఉంటాయి. వీటి డీలర్లు ఒక లోడు (12 వేల లీటర్లు)కు రూ.14 లక్షలు కట్టి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తుంటారు. గతంలో ముందుగా డబ్బులు చెల్లించకపోయినా కంపెనీలు సరఫరా చేసేవి. తర్వాత అడ్వాన్స్ విధానం తీసుకొచ్చాయి. ప్రస్తుతం రేషన్ కోటా అంటూ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి. గత డిసెంబరులో ఎంతయితే బంకుల్లో వినియోగం అయిందో అందులో 80 శాతమే ఇస్తామంటూ మెలిక పెట్టాయి. గత నెలలో లక్ష లీటర్లు విక్రయిస్తే.. ఇప్పుడు కేవలం 80 వేల లీటర్లే ఇస్తామని చెబుతున్నాయి. ఆ కోటా దాటిపోతే ఈ నెలకు ఇక ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తున్నారని బంకుల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కోటా విషయం నెల మొదటి వారంలో చెబితే ఏదోలా సర్దుబాటు చేసుకుంటామని.. ఇప్పటికిప్పుడు చెబితే వ్యాపారం ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. అడ్వాన్స్ ఇస్తున్నా లోడులు పంపించడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బంకుల యజమానులంతా శుక్రవారం విజయనగరం కలెక్టర్ సూర్యకుమారిని కలసి తమ సమస్య విన్నవించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీ పరిశ్రమకు సర్కారీ దెబ్బ
[ 18-04-2024]
రాష్ట్రంలో.. ఉమ్మడి జిల్లాలో కీలకమైన లారీ పరిశ్రమ సాలూరులో ఉంది. గతంలో వేలాది మందికి జీవనాధారం. లోడింగ్ అన్లోడింగ్లతో కార్మికులు, యాజమానులు ఎంతో బిజీగా గడిపేవారు. -
తాగునీరో జగనన్న!!
[ 18-04-2024]
వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రజలు తాగునీటికీ కష్టాలు పడ్డారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నేటికీ ఆ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కనీసం అందుబాటులో ఉన్న పథకాలనూ సద్వినియోగం చేసుకోని ఈ సర్కారు గతంలో నిర్మించిన వాటినీ మూలకు తోసేసింది. -
నామపత్రం.. నేడే ఆరంభం
[ 18-04-2024]
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తొలి రోజు నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. -
అయిదేళ్లు.. పరిశ్రమలు కుదేలు!
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లా జనపనార పరిశ్రమలకు ప్రసిద్ధి. గోగుసాగు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ముడిసరకు కొరత లేకపోవడంతో పరిశ్రమలను స్థాపించారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, నెలిమర్ల, కొత్తవలసలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి. -
వైభవం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రెండో భద్రాదిగా విరాజిల్లుతున్న రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముని కల్యాణం వైభవంగా జరిగింది. తిరుపతి, సింహాచలం దేవస్థానాల నుంచి వచ్చిన పట్టువస్త్రాలు, -
తెదేపాలో వైకాపా కార్యకర్తల చేరిక
[ 18-04-2024]
చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వైకాపాకు చెందిన 13వ వార్డు సభ్యురాలు మీసాల కామేశ్వరి, శ్రీనివాసరావు దంపతులు, మాజీ వార్డు సభ్యుడు రెడ్డి త్రినాథ, ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు రెడ్డి అసిరినాయుడు, -
దేవస్థానం భూమినే కప్పేస్తున్నారు!!
[ 18-04-2024]
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి దేవస్థానం భూములు ఆక్రమణలకు గురవుతున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. జేఎన్టీయూ కూడలి సమీపంలోని రెండు రోడ్లకు మధ్యలో దేవస్థానానికి చెందిన స్థలం ఉంది. -
జనసేన అభ్యర్థిని నాగమాధవికి బి-ఫారం
[ 18-04-2024]
కూటమి అభ్యర్థినిగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న లోకం నాగమాధవి జనసేన అధినేత పవన్కల్యాణ్ చేతులమీదుగా బి-ఫారం అందుకున్నారు. -
అప్పుడు రూ.250.. ఇప్పుడు రూ.10,000
[ 18-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ధరావత్తు చెల్లించాలి. శాసనభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ధరావత్తుగా రూ.10 వేలు ఎన్నికల సంఘానికి చెల్లించాలి. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం: శ్రీభరత్
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై