logo

‘ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్‌ను నమ్మరు’

ఎన్నికలు దగ్గర పడ్డాయనే ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందని, ఎన్ని కుయుక్తులు పన్నినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనం మళ్లీ నమ్మరని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు ధ్వజమెత్తారు. రాజాంలో ఆయన గురువారం

Published : 20 May 2022 04:24 IST


మాట్లాడుతున్న కళా వెంకటరావు

రాజాం, న్యూస్‌టుడే: ఎన్నికలు దగ్గర పడ్డాయనే ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందని, ఎన్ని కుయుక్తులు పన్నినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనం మళ్లీ నమ్మరని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు ధ్వజమెత్తారు. రాజాంలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు తలపెట్టిన బస్సు యాత్ర పెద్ద బోగస్‌ అని ఎద్దేవా చేశారు. డబ్బా కొట్టుకోవడానికే దీన్ని చేపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడ్డాయని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని