logo

నేడు నారా లోకేశ్‌ రాక

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం రాజాం రానున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ విమానాశ్రయానికి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 4.30 గంటలకు

Published : 20 May 2022 04:24 IST

రాజాం, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం రాజాం రానున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ విమానాశ్రయానికి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 4.30 గంటలకు రాజాం వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీకాకుళం, పాలకొండ రహదారుల మీదుగా సాగే రోడ్డుషోలో  పాల్గొంటారు. అనంతరం పాలకొండ రహదారిలోని సీతారామ థియేటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆయన సమక్షంలో తెదేపాలో చేరనున్నారు. అనంతరం జీఎంఆర్‌ఐటీ సమీపంలోని ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరగనున్న తూర్పుకాపు కార్పొరేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొల్ల అప్పలనాయుడు కుమార్తె వివాహానికి హాజరవుతారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని