మ్యుటేషన్ల వివరాలు సమర్పించాలని ఆదేశాలు
విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో 2020 ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది మే నెల వరకు జరిగిన మ్యుటేషన్ల వివరాలను రెండు రోజుల్లో అందించాలని తహసీల్దార్లను ఆర్డీవో భవానీశంకర్ ఆదేశించారు.
శృంగవరపుకోట, న్యూస్టుడే: విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో 2020 ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది మే నెల వరకు జరిగిన మ్యుటేషన్ల వివరాలను రెండు రోజుల్లో అందించాలని తహసీల్దార్లను ఆర్డీవో భవానీశంకర్ ఆదేశించారు. మండలాల్లో అన్ రిజిస్టర్డ్ పార్టీషియన్ డీడ్లతో అక్రమంగా మ్యుటేషన్లు చేస్తున్న వైనంపై బుధవారం ‘ఈనాడు’లో ‘దొడ్డిదారిన మ్యుటేషన్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ప్రాంతీయ విజిలెన్సు, ఎన్ఫోర్సుమెంటు అధికారి కోరిన వివరాలు అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. దాదాపు రెండేళ్ల కాలంలో జరిగిన మ్యుటేషన్లు, అందులో రిజిస్టర్డు డీడ్లు, అన్ రిజిస్టర్డు డీడ్ల వివరాలు, విస్తీర్ణం, ఐడీలు, దరఖాస్తు చేసిన తేదీలు తదితరాలను సమగ్రంగా అందించాలన్నారు.
కార్యాలయాల్లో గందరగోళం: ఆర్డీవో ఆదేశాలతో తహసీల్దారు కార్యాలయాల్లో గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా 2020 నుంచి ఏడాదిన్నర పాటు (కరోనా సమయంలో) ఇష్టారాజ్యంగా మ్యుటేషన్లు జరిగాయి. ఇప్పుడు వీటిపై పరిశీలన జరిగితే గుట్టురట్టవుతుందని రెవెన్యూ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్నిచోట్ల అన్రిజిస్టర్డు పార్టీషియన్ డీడ్ల్లో వారసుల సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ వివరాలన్నీ ఉన్నతాధికారులకు అందితే పెద్దఎత్తున అక్రమాలు బయటపడే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.