logo

సంక్షేమ పథకాలే ప్రజా ఆదరణకు నిదర్శనం: ఎమ్మెల్యే

సంక్షేమ పథకాలే ప్రజా ఆదరణకు నిదర్శనమని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. శుక్రవారం బాటసింగిపేట గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Updated : 20 May 2022 13:06 IST

బొండపల్లి: సంక్షేమ పథకాలే ప్రజా ఆదరణకు నిదర్శనమని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. శుక్రవారం బాటసింగిపేట గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఇంటింటికీ వెళ్లి వృద్ధులను, మహిళలతో స్వయంగా మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా పథకాలు పొందిన లబ్ధిదారులు అధికారులకు లంచాలేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. లంచం ఇవ్వకుండా పథకాలు అందాయని వారు తెలపడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం నవరత్నాలు కార్యక్రమం చేపట్టి ప్రజా సంక్షేమాన్ని కాపాడుతోందని, ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చెల్లంనాయుడు, జడ్పీటీసీ సూర్యప్రకాశరావు, గజపతినగర మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ముత్యాల నాయుడు, మాజీ ఎంపీపీ బంగారమ్మ, గ్రామ సర్పంచి మీసాల జానకిరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని