logo

భాజపా బలోపేతానికి కృషి

నాయకులు కార్యకర్తలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భాజపా జిల్లా ఇన్‌ఛార్జి అడ్డూరి శ్రీరామ్‌ కోరారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని అధ్యక్షతన పదాధికారులు, మండల అధ్యక్షులు, ఇన్‌ఛార్జుల సమావేశాన్ని నిర్వహించారు.

Published : 21 May 2022 04:27 IST


మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి శ్రీరామ్‌

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: నాయకులు కార్యకర్తలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భాజపా జిల్లా ఇన్‌ఛార్జి అడ్డూరి శ్రీరామ్‌ కోరారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని అధ్యక్షతన పదాధికారులు, మండల అధ్యక్షులు, ఇన్‌ఛార్జుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరామ్‌ మాట్లాడుతూ ఈనెల 23న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నెల్లిమర్ల, చీపురుపల్లిలో పర్యటించనున్నారని, జూన్‌ 5న రాష్ట్రానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారని, ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బగ్గాం రాజేష్, నాయకులు మోహనరావు, విజయ్, సుబ్బారావు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని