వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగు
జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన, మండలి ఛైర్మన్ వెంకటేశ్వరరావు,
కలెక్టర్ సూర్యకుమారి, ప్రజాప్రతినిధులు, అధికారులు
కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ధాన్యం సేకరణలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, వచ్చే ఏడాది ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్పందిస్తూ జిల్లా విభజన వల్ల ఎక్కువ రైస్మిల్లులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నందున ఇక్కడ వాటి సంఖ్య తగ్గిందని, కొత్తగా మిల్లుల ఏర్పాటుకు ఏపీఐఐసీ స్థలాన్ని కేటాయిస్తుందని, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ప్రోత్సహిస్తామని, వరికి బదులుగా వేరుశెనగను ప్రోత్సహించాలని జడ్పీ ఛైర్మన్ సూచించారు. కదిరి-లేపాక్షి, నిత్య హరిత రకాలను ప్రోత్సహించేలా శాస్త్రవేత్తలతో కార్యశాలలు నిర్వహించి సలహాలు అందించాలన్నారు. వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ-పంట నమోదుపైనే రైతు భవిష్యత్తు ఆధారపడి ఉన్నందున ఆ ప్రక్రియ వంద శాతం చేపట్టాలన్నారు.
జిల్లా నీటి పారుదల కమిటీ సమావేశంలో ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు నీరు విడుదల చేసేలోగా జైకా నిధులతో చేపడుతున్న పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. జూన్ 15 నాటికి మడ్డువలస నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్ఈ రాంబాబు వివరించారు. మడ్డువలసకు రూ.6.5 లక్షలతో చేపడుతున్న మరమ్మతులు మే ఆఖరుకు పూర్తి చేస్తామన్నారు. తాటిపూడి, ఆండ్ర నీటిని జులై 15న విడుదల చేస్తామన్నారు. సమావేశంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముద్రించిన పంటల సాగులో కీలక యాజమాన్య పద్ధతులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జేసీ మయూర్ అశోక్, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కంబాల జోగులు, డీసీఎంఎస్ ఛైర్పర్సన్ భావన, కమిటీ సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను ఉన్నానన్నావ్.. విన్నానన్నావ్.. ఐదేళ్లుగా ఏం చేశావ్!
[ 23-04-2024]
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు. -
ఎస్.కోటను అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. -
పదిలో అయిదో స్థానం
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
వైకాపా పతనం తప్పదు: కళా
[ 23-04-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. -
పార్లమెంటుకు 05 .. అసెంబ్లీకి 24
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి 05, అసెంబ్లీ స్థానాలకు 24 వచ్చాయి. ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ రెండు సెట్ల నామపత్రాలు అందజేశారు. -
కోటలో జనసంద్రం
[ 23-04-2024]
శృంగవరపుకోటలో చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం సభకు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జగ్గంపేట సభ అనంతరం వచ్చిన చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద అభ్యర్థులు శ్రీభరత్, కోళ్ల లలితకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, కార్యదర్శి ఐ.సుధారాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ, భాజపా నియోజకవర్గ కన్వీనర్ జగదీశ్వరి స్వాగతం పలికారు. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలు
[ 23-04-2024]
అరకు పార్లమెంటరీ.. -
నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
[ 23-04-2024]
కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్కుమార్ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. -
ప్రకటనల మోత.. ఏదీ రైలుబస్సు కూత
[ 23-04-2024]
మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్లో రైలు కూత వినిపించకుండా పోయింది. -
ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సామే
[ 23-04-2024]
నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
జగన్ చెప్పారంటే.. చేయరంతే!
[ 23-04-2024]
ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. -
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్ 600కు 592, ఎం.హర్షవర్థన్ 592, కె.రాకేష్ 590 మార్కులు సాధించారు. -
‘ప్రజల్ని దోచేసిన వైకాపా’
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజల కష్టాన్ని అధిక ధరలు, ఛార్జీల రూపంలో దోచేసిందని కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలం కోడూరు, ఏనుగువలస గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు