అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్!
రాష్ట్రంలో దళితులపై దాడులను నిరసిస్తూ నెల్లిమర్లలో చేపట్టదలచిన కొవ్వొత్తుల ర్యాలీకి చీపురుపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి వెళ్తున్న తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు.
తెదేపా నిరసన ర్యాలీలో కిమిడి నాగార్జున
చీపురుపల్లిలో ఉద్రిక్తత
చీపురుపల్లిలో తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు నాగార్జునను
అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకెళుతున్న పోలీసులు
చీపురుపల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలో దళితులపై దాడులను నిరసిస్తూ నెల్లిమర్లలో చేపట్టదలచిన కొవ్వొత్తుల ర్యాలీకి చీపురుపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి వెళ్తున్న తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి కారులో బయలుదేరిన ఆయన్ని పట్టణంలోని కొత్తగవిడివీధిలో ఆపి నిరసనకు అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని సీఐ జి.సంజీవిరావు, ఎస్సై ఎ.సన్యాసినాయుడు సూచించారు. తాను నిరసన చేపడతానని, అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో ఆవేదన తెలిపే హక్కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు. అర గంట పాటు చర్చలు జరిపాక నాగార్జునను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. నాగార్జున, పార్టీ నాయకులుఫ రౌతు కామునాయుడు, పైల బలరాం, దన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్కుమార్, ముల్లు రమణ, గవిడి నాగరాజు తదితరులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
నినాదాల హోరు
ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. నాగార్జునను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించడంతో ఎవర్నీ ముందుకు వెళ్లనీయకుండా పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసులు వారిని పక్కకు నెట్టి స్టేషన్కు తీసుకెళ్లారు. నాయకుల అరెస్టుల నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా శ్రేణుల నినాదాలతో ప్రధాన రహదారి హోరెత్తింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అరెస్టులకు భయపడేది లేదని, అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, కొన్ని రోజుల కిందట నాలుగు రహదారుల కూడలిలో మంత్రి బొత్స హాజరైన రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరు అనుమతి ఇచ్చారని, అధికార పార్టీకి ఒక న్యాయం... తెదేపాకు మరో న్యాయమా...? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇటీవల ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీలను అధికారులు బలవంతంగా తొలగించారని, వైకాపా ప్రభుత్వం, పెద్దల అండదండలతోనే రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు.
కాగడాల ప్రదర్శన భగ్నం
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: వైకాపా పాలనలో దళితులపై దాడులకు నిరసనగా నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం తెదేపా తలపెట్టిన కాగడాల ప్రదర్శనను పోలీసులు భగ్నం చేశారు. ముందస్తుగా దిగ్బంధించారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడ్ని విజయనగరంలోని నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లిమర్ల కేంద్రంలో కార్యక్రమానికి వెళ్లిన విజయనగరం నియోజకవర్గం ఎస్సీ విభాగం నేతలు పోలీసుల అరెస్టులతో మధ్యలో వెనుదిరగాల్సి వచ్చింది.
విజయనగరంలో గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు
చీపురుపల్లిలో కార్యకర్తను నెడుతున్న పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..