కి.మీ. పరిధిలోనే.. 3,4,5 తరగతుల విలీనం
పాఠశాలల విలీనం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తొలుత మూడు కి.మీ. పరిధిలో ఉన్న 3, 4, 5 తరగతులను విలీనం చేస్తారని భావించినా..ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2022-23 విద్యాసంవత్సరానికి
విలీన ప్రక్రియపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నిరసన
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: పాఠశాలల విలీనం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తొలుత మూడు కి.మీ. పరిధిలో ఉన్న 3, 4, 5 తరగతులను విలీనం చేస్తారని భావించినా..ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2022-23 విద్యాసంవత్సరానికి కి.మీ. దూరంలో ఉన్న తరగతులనే కలపాలనే ఆదేశాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అధికారులు కసరత్తు ప్రారంభించారు.
సమీప బడుల్లో...: ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఏది అందుబాటులో ఉంటే అందులో కలుపుతారు. గతంలో మ్యాపింగ్ చేసిన మేరకు 421 పాఠశాలలు కి.మీ. పరిధిలో ఉన్నట్లు గుర్తించినప్పటికీ ఇందులో ఎన్నింటిని చేస్తారో ఇంకా తేల్చాల్సి ఉంది.
గతేడాది కసరత్తు..: విలీనానికి సంబంధించిన కసరత్తంతా గతేడాది చేశారు. 2021-22లో 250 మీటర్ల పరిధిలోని 143 పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలో ఉన్న 136 ఉన్నత పాఠశాలల్లో కలిపారు. వసతి సమస్యతో కొన్ని పాఠశాలలు కాగితాల్లో కలిపేసినట్లున్నా...తరగతుల నిర్వహణ మాత్రం ఉన్న చోటే కొనసాగింది. 2022-23 ఏడాది నుంచి 3 కి.మీ. పరిధిలో 983 పాఠశాలలను దశలవారీగా కలిపేందుకు మ్యాపింగ్ చేశారు. వీటిలో 82 చోట్ల అనుకూలంగా లేదని, మిగిలిన 901 పాఠశాలలను విలీనానికి సిద్ధం చేశారు. ఇప్పుడు కి.మీ. పరిధిలో చేయాలనుకోవడంతో మార్పులు జరుగుతున్నాయి.
పాత జిల్లా ప్రాతిపదికనే..: జిల్లా విభజన కాకముందు 34 మండలాలున్నాయి. విభజన తర్వాత విజయనగరంలో 27, పార్వతీపురం మన్యంలో 15 మండలాలున్నాయి. పాత జిల్లాలో మండలాల ప్రాతిపదికనే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో రెండు జిల్లాల్లో అధికారులు గతంలో ఉన్న మండలాలనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.
సరిపడా వసతి ఉంటేనే..: విలీనం చేసే పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులుండాలని స్పష్టం చేయడంతో ఫీజుబులిటీ ఉన్నవాటిని గుర్తిస్తున్నారు. ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఇతరత్ర రూపాల్లో అదనంగా ఉన్న గదులను ముందుగా తరగతుల నిర్వహణకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించడంతో ఆ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకటి రెండురోజుల్లో విలీనమయ్యే పాఠశాలల సంఖ్య కొలిక్కి రానుందని అధికారులు చెబుతుండగా... ఈ ప్రక్రియపై వ్యతిరేకత కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలతో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న దానిపై అంతటా చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్