భాజపా, వైకాపా వర్గాల మధ్య కొట్లాట
నెల్లిమర్లలో సోమవారం భాజపా, వైకాపా కార్యకర్తల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. బిర్యానీ తగాదా ఘర్షణకు దారితీసింది. ఇక్కడ కొత్తపేట సమీపంలో భాజపా కార్యకర్తలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.
బిర్యానీ విషయమై తగాదా..పలువురికి గాయాలు
ఎస్ఐతో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
నెల్లిమర్ల, న్యూస్టుడే: నెల్లిమర్లలో సోమవారం భాజపా, వైకాపా కార్యకర్తల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. బిర్యానీ తగాదా ఘర్షణకు దారితీసింది. ఇక్కడ కొత్తపేట సమీపంలో భాజపా కార్యకర్తలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వైకాపా సానుభూతిపరుడు బిర్యానీ కోసం వెళ్లి గొడవ పడ్డాడు. భాజపా కార్యకర్తలు కొట్టడంతో అతనికి స్వల్పగాయాలయ్యాయి. దీనిపై బాధితుడు వార్డు కౌన్సిలర్ మైపాడ ప్రసాద్కు ఫిర్యాదు చేయగా.. ఆయన కార్యకర్తలతో కలసి అక్కడికి వెళ్లి ప్రశ్నించడంతో మళ్లీ దాడికి పాల్పడ్డారు. దాంతో ఆయన చేతికి గాయమైంది. ఈ విషయం తెలిసి వైకాపా కార్యకర్తలు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఈ కొట్లాటలో పలువురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అందరిని చెదరగొట్టారు. ఈ ఘటనపై డీఎస్పీ త్రినాథరావు విచారణ జరిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు భాజపా ఫిర్యాదు
భాజపా కార్యకర్తలపై దాడి చేసినవారు ఎంతటివారైనా క్షమించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ ఘటనపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్కు వెళ్లి ఆయన ఫిర్యాదు చేశారు. దోషులను అదుపులోకి తీసుకోకపోతే పోలీసుస్టేషన్ వద్ద నిరసనకు దిగుతామన్నారు. తమ కార్యకర్తలపై దాడికి దిగినవారిని, మద్దతు పలికినవారిని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పి.మాధవ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, నాయకులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’