logo

పోక్సో కేసులో తల్లీ, ఇద్దరు కుమారులకు పదేళ్ల జైలు

బాలికను అపహరించి, వివాహం జరిపించి, బలవంతంగా కాపురం చేయించిన నేరం రుజువు కావడంతో ఇద్దరు కుమారులు సహా తల్లికి పదేళ్ల చొప్పున జైలుతోపాటు ఒక్కొక్కరు రూ.20 వేల జరిమానా చెల్లించాలని పోక్సో

Published : 24 May 2022 05:14 IST

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: బాలికను అపహరించి, వివాహం జరిపించి, బలవంతంగా కాపురం చేయించిన నేరం రుజువు కావడంతో ఇద్దరు కుమారులు సహా తల్లికి పదేళ్ల చొప్పున జైలుతోపాటు ఒక్కొక్కరు రూ.20 వేల జరిమానా చెల్లించాలని పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పోక్సో కేసుల ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడకి చెందిన ఓ మహిళ 2015 ఏప్రిల్‌ 30న చీపురుపల్లిలో తమ బంధువుల వివాహానికి కుమార్తె(15)తో హాజరైంది. అదే పెళ్లికి జియ్యమ్మవలస, గంగమ్మపేటకు చెందిన పుల్లఖండం గిరిజ, ఆమె కుమారులు సతీష్‌కుమార్, సంతోష్‌కుమార్‌లు వచ్చారు. సతీష్‌ వృత్తిరీత్యా పురోహితుడు. ఇతను వేడుకలో బాలికపై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని ఛాటింగ్‌ చేసేవాడు. 25 రోజుల స్నేహంలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అదే ఏడాది మే 25న బాలికకు ఫోను చేసి, ఇంటి నుంచి బయటకు పిలిచి, కారులో డాల్ఫిన్‌ హైట్స్‌లోని సోదరుడు సంతోష్‌ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న తల్లి గిరిజ, సోదరుడు బాలికకు సతీష్‌తో వివాహం జరిపించి, కాపురం కూడా చేయించారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లి న్యూపోర్టు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో గిరిజ, సతీష్, సంతోష్‌ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న నిందితులు బాలికను గాజువాక దరి దయాల్‌నగర్‌ సమీపంలో విడిచిపెట్టి పారిపోయారు. ఆమె  ఇంటికి చేరుకుని తల్లికి విషయం తెలిపింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు సోమవారం శిక్ష విధించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని