పోక్సో కేసులో తల్లీ, ఇద్దరు కుమారులకు పదేళ్ల జైలు
బాలికను అపహరించి, వివాహం జరిపించి, బలవంతంగా కాపురం చేయించిన నేరం రుజువు కావడంతో ఇద్దరు కుమారులు సహా తల్లికి పదేళ్ల చొప్పున జైలుతోపాటు ఒక్కొక్కరు రూ.20 వేల జరిమానా చెల్లించాలని పోక్సో
విశాఖ లీగల్, న్యూస్టుడే: బాలికను అపహరించి, వివాహం జరిపించి, బలవంతంగా కాపురం చేయించిన నేరం రుజువు కావడంతో ఇద్దరు కుమారులు సహా తల్లికి పదేళ్ల చొప్పున జైలుతోపాటు ఒక్కొక్కరు రూ.20 వేల జరిమానా చెల్లించాలని పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పోక్సో కేసుల ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడకి చెందిన ఓ మహిళ 2015 ఏప్రిల్ 30న చీపురుపల్లిలో తమ బంధువుల వివాహానికి కుమార్తె(15)తో హాజరైంది. అదే పెళ్లికి జియ్యమ్మవలస, గంగమ్మపేటకు చెందిన పుల్లఖండం గిరిజ, ఆమె కుమారులు సతీష్కుమార్, సంతోష్కుమార్లు వచ్చారు. సతీష్ వృత్తిరీత్యా పురోహితుడు. ఇతను వేడుకలో బాలికపై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని ఛాటింగ్ చేసేవాడు. 25 రోజుల స్నేహంలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అదే ఏడాది మే 25న బాలికకు ఫోను చేసి, ఇంటి నుంచి బయటకు పిలిచి, కారులో డాల్ఫిన్ హైట్స్లోని సోదరుడు సంతోష్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న తల్లి గిరిజ, సోదరుడు బాలికకు సతీష్తో వివాహం జరిపించి, కాపురం కూడా చేయించారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లి న్యూపోర్టు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో గిరిజ, సతీష్, సంతోష్ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న నిందితులు బాలికను గాజువాక దరి దయాల్నగర్ సమీపంలో విడిచిపెట్టి పారిపోయారు. ఆమె ఇంటికి చేరుకుని తల్లికి విషయం తెలిపింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు సోమవారం శిక్ష విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
[ 20-04-2024]
ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం. -
తోటపల్లి పార్కు జీవం తీసేశారు
[ 20-04-2024]
మన్యంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తెదేపా హయాంలో 2016-17 మధ్య తోటపల్లి ప్రాజెక్టు గట్టుకు ఆనుకొని ఐటీడీఏ ఆధ్వర్యంలో పార్కు ఏర్పాటు చేశారు. -
అయిదేళ్లలో బొత్స సోదరుల ఆస్తులు రెట్టింపు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు అధిక సంఖ్యలోనే దాఖలయ్యాయి. శృంగవరపుకోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అఫిడవిట్ దాఖలు చేయలేదు. -
వాహనాల్లో కుక్కేశారు.. ట్రాఫిక్లో ఉంచేశారు
[ 20-04-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు. -
తరలింపు వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
[ 20-04-2024]
నామినేషన్ ఘట్టానికి వైకాపా కార్యకర్తలను తరలించిన ఆటో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రాజాన దిలీప్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. -
ఉల్లంఘనలు కనిపించడం లేదా?
[ 20-04-2024]
పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు ఏం చేసినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. -
ప్రజలకు జగనన్న షాక్
[ 20-04-2024]
తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా బాకా ఊదారు సీఎం జగన్. బాదుడే.. బాదుడు అంటూ అప్పటి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేశారు. దీంతో నిజమని నమ్మేశారు కొందరు ప్రజలు. -
చందనోత్సవ వైఫల్యాలపై నివేదిక ఏదీ..?: అశోక్
[ 20-04-2024]
సింహాచలం దేవస్థానంలో గతేడాది చందనోత్సవ సమయంలో జరిగిన వైఫల్యాలపై చేపట్టిన విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్
[ 20-04-2024]
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్కు రోజులు దగ్గర పడ్డాయని, వైకాపా వచ్చిన తర్వాత దోపిడీ ఎక్కువైందని చీపురుపల్లి ఎన్డీయే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా