logo

హత్యాయత్నం కేసులో వ్యక్తికి నాలుగేళ్ల జైలు

భోగాపురం మండలం కొండరాజుపాలేనికి చెందిన ఎం.ధనరాజ్‌ అదే గ్రామానికి చెందిన ఎలమాజీ కుటుంబీకులపై హత్యాయత్నం చేశారనే నేరం న్యాయస్థానంలో రుజువవ్వడంతో ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ

Published : 24 May 2022 05:14 IST

విజయనగరం న్యాయవార్తావిభాగం, న్యూస్‌టుడే: భోగాపురం మండలం కొండరాజుపాలేనికి చెందిన ఎం.ధనరాజ్‌ అదే గ్రామానికి చెందిన ఎలమాజీ కుటుంబీకులపై హత్యాయత్నం చేశారనే నేరం న్యాయస్థానంలో రుజువవ్వడంతో ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ అసిస్టెంట్‌ సెషన్స్‌ న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. కొండరాజుపాలేనికి చెందిన ఎలమాజీ కుటుంబీకులతో, ధనరాజ్‌ కుటుంబానికి కొన్నాళ్లుగా కలహాలు ఉన్నాయి ఈ క్రమంలో 2016 మే 4న జరిగిన వివాదంలో ఎలమాజీ కుటుంబీకులపై ధనరాజ్‌ హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భోగాపురం పోలీసులు కేసు నమోదుచేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. పూర్తి విచారణలో నేరం రుజువు కావటంతో  నాలుగేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని