logo

ఆరికతోటలో దారుణ హత్య

రామభద్రపురం మండలం ఆరికతోటలో పాతకక్షలు ఒకర్ని బలిగొన్నాయి. సీఐ శోభనబాబు, ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వర్రి చిన్నోడు (57) శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు.

Updated : 02 Jul 2022 06:41 IST

పాత కక్షలే కారణమంటున్న పోలీసులు


వర్రి చిన్నోడు (పాతచిత్రం)

రామభద్రపురం, బొబ్బిలి, న్యూస్‌టుడే: రామభద్రపురం మండలం ఆరికతోటలో పాతకక్షలు ఒకర్ని బలిగొన్నాయి. సీఐ శోభనబాబు, ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వర్రి చిన్నోడు (57) శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. చిమ్మచీకటి, చిరుజల్లులు.. ఆపై విద్యుత్తు సరఫరా లేని సమయంలో సమీపంలోని దుకాణానికి రోడ్డుపై నడిచి వెళ్తుండగా దుండగులు ఇనుప రాడ్లు, కత్తులతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గత వినాయక చవితి సమయంలో చిన్నోడికి, కొంతమందికి మధ్య గొడవ జరిగి కేసు నమోదైంది. అప్పటి నుంచి వారి మధ్య పాత కక్షలు నడుస్తూనే ఉన్నాయి. హత్యలో ఆయా వ్యక్తుల పాత్ర ఉంటుందని, పథకం ప్రకారం చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్రి చిన్నోడికి భార్య సత్తెమ్మ, కుమారులు అప్పన్న, శివుడు, కుమార్తెలు పార్వతి, గౌరి ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇక మాకెవరు దిక్కంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని