logo

మూడు రాజధానులకు సహకరించాలి

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు ఏర్పాటు కావాలని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. విజయ దశమి పండగ సందర్భంగా గొట్లాం గ్రామంలోని బంగారమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 05 Oct 2022 16:37 IST

బొండపల్లి : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు ఏర్పాటు కావాలని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. విజయ దశమి పండగ సందర్భంగా గొట్లాం గ్రామంలోని బంగారమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు ధనార్జనే ధ్యేయంగా దురుద్దేశంతో ఒక ప్రాంతం అభివృద్ధిని కోరుతున్నారని విమర్శించారు. అలాంటి వారి మనసు మార్చాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.సురేశ్‌బాబు, ఎంపీపీ చల్లా చల్లమనాయుడు, జడ్పీటీసీ సభ్యుడు సూర్యప్రకాశ్‌రావు, మండల వైకాపా కన్వీనర్‌ ఈదిబెల్లి కృష్ణ, జిల్లా నాయకులు ఎం.తులసి, రమణ, చిన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని