logo

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ప్రజలు న్యాయ, సంక్షేమ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మీకుమారి తెలిపారు.

Updated : 26 Nov 2022 17:44 IST

విజయనగరం గ్రామీణం: ప్రజలు న్యాయ, సంక్షేమ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మీకుమారి తెలిపారు. శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించేందుకు సంస్థ నిత్యం అందుబాటులో ఉంటుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైనప్పుడు న్యాయపరమైన హక్కులను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెట్విజ్‌ సీఈవో రామానందం, న్యాయ కళాశాల ఆచార్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు