రారండోయ్... మునగ నర్సరీలకు!
మునగ ఆకు, మునగకాడలు తెలియని వారు ఉండరు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎవరినడిగినా చెబుతారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లాలో మునగ నర్సరీల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గుర్లలో నర్సరీని పరిశీలిస్తున్న వెలుగు అధికారులు
విజయనగరం మయూరి కూడలి, న్యూస్టుడే: మునగ ఆకు, మునగకాడలు తెలియని వారు ఉండరు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎవరినడిగినా చెబుతారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లాలో మునగ నర్సరీల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డీఆర్డీఏ-వెలుగు ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో ప్రత్యేక ప్రాజెక్టుగా నర్సరీల ఏర్పాటుకు ఈ ఏడాది మే, జూన్లో సర్వే చేశారు. మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. జిల్లాలో 48.40 ఎకరాల్లో మునగ నర్సరీలు ఏర్పాటవుతాయని తొలుత భావించారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. స్వయం సహాయక సంఘాల్లో 4,47,850 మంది సభ్యులకు ఐదు మొక్కల చొప్పున 22,39,250 అవసరం కాగా ప్రస్తుతం నర్సరీల్లో 5,52,500 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. కేవలం 19 మండలాల్లో 54 మంది రైతులు 8.10 ఎకరాల్లో 36 నర్సరీలను మాత్రమే ఏర్పాటు చేయడంతో అధికారులు కంగుతిన్నారు. డెంకాడ, బొబ్బిలి, తెర్లాం, బాడంగి, భోగాపురం, రామభద్రపురం, విజయనగరం, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు చెందిన 34 మంది రైతులు ముందుకు వచ్చి తర్వాత వెనకడుగు వేశారు. దీంతో జిల్లాలో మొక్కల పంపిణీని పూర్తిస్థాయిలో అధికారులు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు.
నిధుల కేటాయింపు..
నర్సరీలకు అవసరమైన నిధులు ఉపాధి హామీ (నరేగా) ద్వారా నేరుగా రైతు ఖాతాకే చెల్లిస్తారు. ఐదు నుంచి పది సెంట్ల నర్సరీ యూనిట్కు రూ.29,890, అదే ఎకరా యూనిట్కు రూ.5,56,000 ఇవ్వనున్నారు. మొక్కలు అందుబాటులోకి వచ్చాక అధికారుల సూచనల మేరకు ప్రతి మహిళకు ఉచితంగా అయిదేసి మొక్కలు ఇవ్వాలనేది నిబంధన. జిల్లాలో పెద్ద నర్సరీని చీపురుపల్లి మండలంలో ఎకరా పొలంలో ఏర్పాటు చేశారు.
దశల వారీగా అందరికి. : దశల వారీగా ఎక్కువ నర్సరీలు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు మొక్కలు అందిస్తాం. మునగ ప్రయోజనాలపై అవగాహన కల్పించి రైతులతో నర్సరీల ఏర్పాటుకు చర్యలు చేపడతాం. అందుబాటులోకి వచ్చిన మొక్కలను తొలుత పంపిణీ చేస్తాం. మళ్లీ అదే నర్సరీలో రైతులకు ఆసక్తి ఉంటే మళ్లీ వారితోనే వీటిని పెంచేలా ప్రోత్సహిస్తాం.
-ఎ.కల్యాణ్ చక్రవర్తి, పథక సంచాలకుడు, డీఆర్డీఏ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీ పరిశ్రమకు సర్కారీ దెబ్బ
[ 18-04-2024]
రాష్ట్రంలో.. ఉమ్మడి జిల్లాలో కీలకమైన లారీ పరిశ్రమ సాలూరులో ఉంది. గతంలో వేలాది మందికి జీవనాధారం. లోడింగ్ అన్లోడింగ్లతో కార్మికులు, యాజమానులు ఎంతో బిజీగా గడిపేవారు. -
తాగునీరో జగనన్న!!
[ 18-04-2024]
వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రజలు తాగునీటికీ కష్టాలు పడ్డారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నేటికీ ఆ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కనీసం అందుబాటులో ఉన్న పథకాలనూ సద్వినియోగం చేసుకోని ఈ సర్కారు గతంలో నిర్మించిన వాటినీ మూలకు తోసేసింది. -
నామపత్రం.. నేడే ఆరంభం
[ 18-04-2024]
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తొలి రోజు నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. -
అయిదేళ్లు.. పరిశ్రమలు కుదేలు!
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లా జనపనార పరిశ్రమలకు ప్రసిద్ధి. గోగుసాగు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ముడిసరకు కొరత లేకపోవడంతో పరిశ్రమలను స్థాపించారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, నెలిమర్ల, కొత్తవలసలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి. -
వైభవం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రెండో భద్రాదిగా విరాజిల్లుతున్న రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముని కల్యాణం వైభవంగా జరిగింది. తిరుపతి, సింహాచలం దేవస్థానాల నుంచి వచ్చిన పట్టువస్త్రాలు, -
తెదేపాలో వైకాపా కార్యకర్తల చేరిక
[ 18-04-2024]
చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వైకాపాకు చెందిన 13వ వార్డు సభ్యురాలు మీసాల కామేశ్వరి, శ్రీనివాసరావు దంపతులు, మాజీ వార్డు సభ్యుడు రెడ్డి త్రినాథ, ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు రెడ్డి అసిరినాయుడు, -
దేవస్థానం భూమినే కప్పేస్తున్నారు!!
[ 18-04-2024]
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి దేవస్థానం భూములు ఆక్రమణలకు గురవుతున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. జేఎన్టీయూ కూడలి సమీపంలోని రెండు రోడ్లకు మధ్యలో దేవస్థానానికి చెందిన స్థలం ఉంది. -
జనసేన అభ్యర్థిని నాగమాధవికి బి-ఫారం
[ 18-04-2024]
కూటమి అభ్యర్థినిగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న లోకం నాగమాధవి జనసేన అధినేత పవన్కల్యాణ్ చేతులమీదుగా బి-ఫారం అందుకున్నారు. -
అప్పుడు రూ.250.. ఇప్పుడు రూ.10,000
[ 18-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ధరావత్తు చెల్లించాలి. శాసనభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ధరావత్తుగా రూ.10 వేలు ఎన్నికల సంఘానికి చెల్లించాలి. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం: శ్రీభరత్
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు.