logo

విజయనగరంవాసికి సంగీత నాటక అకాడమీ పురస్కారం

ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న విజయనగరానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు డాక్టర్‌ పత్రి సతీష్‌కుమార్‌కు 2020 ఏడాదికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది.

Published : 27 Nov 2022 03:56 IST

విజయనగరం కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న విజయనగరానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు డాక్టర్‌ పత్రి సతీష్‌కుమార్‌కు 2020 ఏడాదికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈయన ఇక్కడే పుట్టి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పదో ఏట నుంచే మృదంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఆల్‌ ఇండియా రేడియోలో మృదంగ కళాకారునిగా పని చేసి చెన్నైకి బదిలీపై వెళ్లారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి దేశ, విదేశాల్లో సంగీత ప్రదర్శనలిచ్చారు. కొవిడ్‌ విజృంభణ కారణంగా 2020 ఏడాదిలో ఇవ్వాల్సిన పురస్కారాన్ని అప్పట్లో ఇవ్వలేదు. ఇప్పుడు ప్రకటించడంతో జిల్లావాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని