logo

జనసేన బలోపేతమే లక్ష్యం

సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శనివారం గంట్యాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అయిదు రోజులు పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నామన్నారు.

Published : 27 Nov 2022 03:56 IST

సమావేశంలో మాట్లాడుతున్న పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శనివారం గంట్యాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అయిదు రోజులు పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నామన్నారు. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశమున్నా.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు. దివ్యాంగులకు ఏడాదిగా పింఛన్లు నిలిపేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు జనసైనికులతో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైకాపా విముక్తికి అంకితభావంతో అంతా కలిసి   కట్టుగా పనిచేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని