logo

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల విజేత విశాఖ

విజయనగరం వేదికగా రాజీవ్‌ మైదానంలో మూడురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్త్రీ, పురుషుల బాక్సింగ్‌ టోర్నమెంట్‌ ఆదివారం సాయంత్రం ముగిసింది. 

Updated : 27 Nov 2022 18:27 IST

విజయనగరం రింగురోడ్డు: విజయనగరం వేదికగా రాజీవ్‌ మైదానంలో మూడురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్త్రీ, పురుషుల బాక్సింగ్‌ టోర్నమెంట్‌ ఆదివారం సాయంత్రం ముగిసింది. విశాఖపట్నం జట్టు ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌తోపాటు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజయనగరం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ ట్రోఫీలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో బాక్సింగ్‌ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్షణ్‌దేవ్‌, ఉపాధ్యక్షుడు మన్మథకుమార్‌, కోచ్‌ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని