కాలువలకు మహర్ధశ
ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనుల్లో ప్రాధాన్యం మారుతోంది. ఈ ఏడాది వాటి కింద భవనాలను నిర్మిస్తున్నారు.
2023-24 ఉపాధి ప్రణాళికలో అభివృద్ధి
తాటిపూడి కాలువ
విజయనగరం అర్బన్, గంట్యాడ గ్రామీణం, న్యూస్టుడే: ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ నిధులతో చేపట్టే పనుల్లో ప్రాధాన్యం మారుతోంది. ఈ ఏడాది వాటి కింద భవనాలను నిర్మిస్తున్నారు. 2023-24 ఏడాదిలో నీటి పారుదల కాలువల్ని బాగు చేయాలని నిర్ణయించారు. తుప్పల తొలగింపుతో పాటు పూడికతీత పనులు నిర్వహిస్తారు. ఇప్పటికే ఆయా పనులను గుర్తించిన అధికారులు అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కలెక్టర్ ఆమోదంతో మండల, జిల్లా పరిషత్తులో తీర్మానం ఆధారంగా జనవరి నుంచి పనులు చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో దీర్ఘకాలంగా మేజర్, మైనర్ రిజర్వాయర్ల కాలువలు అభివృద్ధికి నోచుకోలేదు. వీటిలో పూడిక పేరుకుపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఉంటోంది. దీంతో వాటి అభివృద్ధికి జిల్లాస్థాయిలో నిర్ణయించడంతో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 23 మండలాల్లో 269 కాలువలు బాగు చేయాలని నిర్ణయించారు.
వీటికి మంచిరోజులు
విజయనగరం జిల్లా: తాటిపూడి, తోటపల్లి, వెంగళరాయ, ఆండ్ర, పెదగెడ్డ, పెదంకలాం, పారాది, గజపతినగరం ఆనకట్ట.
మన్యం జిల్లా: వట్టిగెడ్డ, జంఝావతి, గుమ్మడి గెడ్డ, కొండలేవిడి, గుజ్జువాయి, లిక్కిడి, ఊసకొండ, వలస బల్లేరు, కైరాడ, జి.శివడ, తోటపల్లి, వరహాల గెడ్డ.
గ్రామసభల్లో..: వచ్చే ఏడాదిలో చేపట్టనున్న పనుల గుర్తింపునకు సంబంధించి ఇప్పటికే గ్రామసభలు పూర్తిచేశారు. రెండు జిల్లాల్లో 1226 గ్రామసభలు నిర్వహించి, 24,928 పనులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో 3468, పార్వతీపురం మన్యంలో 21,460 పనుల్ని ఎంపిక చేశారు. 140 రకాల పనులకు ప్రాధాన్యమిచ్చారు. నీటిపారుదల కాలువలతో పాటు ఫీడర్ ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్లు, ఎంఐ ట్యాంకులు, ట్రెంచ్ కటింగ్, ఫారం పాండ్స్ (నీటి కుంటలు), చేపల చెరువులు, చెత్త సంపద కేంద్రాలు, పెర్క్యులేషన్ ట్యాంకులు, ఉద్యానాలు, సూక్ష్మనీటి సేద్యం తదితర పనులు చేపట్టనున్నట్లు రెండు జిల్లాల పీడీలు ఉమా పరమేశ్వరి, రామచంద్రరావు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయం ఉద్యోగులు అందుబాటులో ఉండాలి
[ 28-03-2024]
బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రామప్రజలు అధికారులను అభ్యర్థించారు. -
మూలకు చేరిన మూడు చక్రాల ఆటోలు
[ 28-03-2024]
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరు చేసిన మూడు చక్రాల ఆటోలు కొన్ని చోట్ల మూలకు చేరాయి. -
లుంబూరు కాలనీలో సౌకర్యాలేవన్నా!
[ 28-03-2024]
ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది. -
అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు
[ 28-03-2024]
సీతానగరం మండల కేంద్రం నుంచి పలు గ్రామాలను అనుసంధానించేందుకు నిర్మించిన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
[ 28-03-2024]
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వసతులు
[ 28-03-2024]
పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ కేంద్రాల వద్ద అన్ని వసతులు పక్కాగా ఉండాలని కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
జలకలే
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు. -
జనం జీవితాల్లో బూడిద
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలోని వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గురుగుబిల్లి, పాచిపెంట, పాలకొండ మండలాల్లో కొండలను పిండి చేస్తున్నారు. అనుమతులు కన్నా అదనపు విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకొంటున్నారు. -
బిల్లులు రాక.. నిర్మాణాలు సాగక
[ 28-03-2024]
-
ఔత్సాహికం.. అల్లంతదూరం
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది. -
ఆపద్బాంధవులకూ కష్టాలే!!
[ 28-03-2024]
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు
[ 28-03-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి రాజాం నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. -
అనుమానంతోనే భార్యను చంపేశాడు
[ 28-03-2024]
ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. -
ఇంటర్ మూల్యాంకనం 50 శాతం పూర్తి
[ 28-03-2024]
కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్.తవిటినాయుడు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ