రోడ్డు ప్రమాదంలో క్యాటరింగ్ యజమాని దుర్మరణం
వలసకూలీగా వచ్చి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం వెంటాడింది. ద్విచక్ర వాహనం రక్షణ గోడను ఢీకొనడంతో క్యాటరింగ్ యజమాని మృత్యువాత పడ్డాడు.
నరసింహులు (పాతచిత్రం)
ఆనందపురం(విశాఖపట్నం), న్యూస్టుడే: వలసకూలీగా వచ్చి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం వెంటాడింది. ద్విచక్ర వాహనం రక్షణ గోడను ఢీకొనడంతో క్యాటరింగ్ యజమాని మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గుర్ల మండలం పెదబంటుబిల్లి గ్రామానికి చెందిన కలగర్ల నరసింహులు(55) వలస కూలీగా 24 ఏళ్ల కిందట విశాఖలోని పూర్ణమార్కెట్కు వచ్చారు. అప్పటి నుంచి రోజువారి కూలీగా చేస్తూ కొన్నేళ్ల కిందట స్వయంగా మణికంఠ క్యాటరింగ్ సెంటర్ను ప్రారంభించి శుభకార్యాలకు ఆహారం అందించడం, వంటలు చేయడం మొదలుపెట్టారు. స్వగ్రామం పెదబంటుబిల్లిలో బంధువులు అయ్యప్పస్వామి పూజ నిర్వహించగా అక్కడ వంటలు చేయడానికి శనివారం రాత్రి వెళ్లారు. పనులు ముగించుకొని సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై సహాయకునితో కలిసి తిరిగి బయలుదేరారు. ఆనందపురంలోని పెద్దిపాలెం వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారి పైవంతెన రక్షణ గోడను వీరి వాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరసింహులు అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.రామచంద్రరావు పేర్కొన్నారు. శవ పరీక్షల అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. నరసింహులుకు భార్య రత్నకుమారి, ముగ్గురు పిల్లలున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని