రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. ఇంత నిర్లక్ష్యమా?
రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల వర్కు, నోటు పుస్తకాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటిని సక్రమంగా వినియోగించకపోతే ఎలా? విద్యార్థులు వాటిపై రాయకుండా అలా ఉంచడమేమిటి?
బొబ్బిలి గురుకుల పాఠశాల సిబ్బందిపై పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆగ్రహం
గురుకులాల కార్యదర్శి నరసింహారావు, ప్రిన్సిపల్ రఘునాథరావు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రవీణ్ప్రకాశ్
బొబ్బిలి, న్యూస్టుడే: రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల వర్కు, నోటు పుస్తకాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటిని సక్రమంగా వినియోగించకపోతే ఎలా? విద్యార్థులు వాటిపై రాయకుండా అలా ఉంచడమేమిటి? ఏం చేస్తున్నారు? ఇంత నిర్లక్ష్యమా? మిమ్మల్ని క్షమించడానికి లేదంటూ గురుకులాల కార్యదర్శి నరసింహారావు, ప్రిన్సిపల్ రఘునాథరావు, బోధనా సిబ్బందిపై పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ మండిపడ్డారు. జిల్లాలోని పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా బొబ్బిలి బాలుర గురుకుల పాఠశాలను గురువారం రాత్రి ఆయన ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల వర్కు, నోటు పుస్తకాలను పరిశీలించారు. పేజీలు ఖాళీగా ఉండడంతో ఎందుకు విద్యార్థులతో రాయించలేదు, విద్యాసంవత్సరం ముగిసినా ఇవి గుర్తుకురాలేదా? అంటూ సంబంధిత బోధన సిబ్బందిని ప్రశ్నించారు. ఇలాగైతే పిల్లలు ఎలా నేర్చుకుంటారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. అక్కడి నుంచి కేజీబీవీ పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులతో ఆయనే నేరుగా మాట్లాడారు. అనంతరం రైల్వే అతిథిగృహంలో రాత్రి 10.30 గంటల తర్వాత విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలను తనిఖీ చేస్తే సరిపోదని, ఏం చేస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆయన వెంట ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈవో లింగేశ్వరరెడ్డి, ఉపవిద్యాశాఖాధికారి తిరుపతినాయుడు ఉన్నారు.
నేడూ పర్యటన..
జిల్లాలోని పలు పాఠశాలలు, వసతిగృహాలను ఆయన శుక్రవారం సందర్శించనున్నట్లు అందిన సమాచారంతో విద్యాశాఖ వర్గాలు కంగారుపడుతున్నాయి. గురువారం రాత్రి గురుకుల పాఠశాలలో బస చేస్తారని భావించి ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన రైల్వే అతిథిగృహానికి చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన నిరుద్యోగులు ఆయనను కలిసి అవకాశం కల్పించాలని వినతిపత్రం అందజేశారు.
విద్యార్థులను తరగతి గది నుంచి బయటకు పంపించి సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించి అసహనం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు మీరెందుకు భయపడుతున్నారు? అంటూ కార్యదర్శిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకీ మీపై చర్య తీసుకునే అధికారం ఎవరికి ఉంది? అని అనగానే మీకే ఉందని కార్యదర్శి అన్నారు. తెలుసు కదా.. ఈ లోపాలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సరిచేసుకోకపోతే అంతా ఇంటికి వెళ్లిపోతారని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!