logo

తెలుగు గొప్పదనాన్ని చాటిన వేమన

తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి యోగి వేమన అని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు.

Published : 20 Jan 2023 02:43 IST

నివాళులర్పిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, అధికారులు

కలెక్టరేట్‌, విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి యోగి వేమన అని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. ఆయన జయంతిని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించారు. తొలుత వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేటితరం పిల్లలకు ఆయన పద్యాలు తప్పకుండా నేర్పించాలని, దీనిపై పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. అనంతరం పద్య పఠన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. డీఆర్వో గణపతిరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

* జడ్పీలో యోగి వేమన చిత్రపటానికి జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. సీఈవో ఎ.అశోక్‌కుమార్‌, ఉప సీఈవో కె.రాజ్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారిణి నిర్మలాదేవి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని