అనుమతి ఒక చోట.. తరగతులు ఇంకోచోట..!
ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒకచోట అనుమతి పొంది...వేరేచోట తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ బోర్డు నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు రేగుతున్నాయి.
ఇంటర్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల పరిస్థితి
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒకచోట అనుమతి పొంది...వేరేచోట తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ బోర్డు నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు రేగుతున్నాయి. కళాశాలల వైఖరి వల్ల మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి కళాశాలలు 11 వరకూ ఉన్నాయని గుర్తించిన బోర్డు అధికారులు నోటీసులు జారీచేసినట్లు ధ్రువీకరించారు.
మండలం దాటి..: విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, ఎస్.కోట, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఇలా నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు అందుకున్న కళాశాలలు చాలానే ఉన్నాయి. ఎక్కువగా జిల్లా కేంద్రమైన విజయనగరంలోనే ఉండడం గమనార్హం. గరివిడిలో అనుమతి పొందిన ఓ కళాశాల చీపురుపల్లి శివరాం కూడలిలో నిర్వహిస్తున్నట్లు నోటీసు జారీతో వెలుగులోకి వచ్చింది. విజయనగరం లంకవీధిలో నిర్వహించిన ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల రెండుసార్లు పేర్లు మార్చుకొంది. ప్రస్తుతం అకాడమీగా నాయుడుతోటలో కొనసాగుతోంది. కె.ఎల్.పురంలో అనుమతి పొందిన మరొకటి ధనలక్ష్మి కాలనీ, నాయుడు కాలనీలో అనుమతిపొందినది తోటపాలెంలో తరగతుల్ని నిర్వహిస్తోంది. ఇటువంటి వాటికి నోటీసులు జారీచేశామని ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సత్యనారాయణ ‘న్యూస్టుడే’కు తెలిపారు. తరలింపు అనుమతుల కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.
నిబంధనలు ఇలా...:
* ప్రభుత్వం కళాశాల మంజూరు చేసిన ఉత్తర్వు ఇవ్వాలి.
* అనుబంధ గుర్తింపు పొందిన పత్రం అందజేయాలి.
* కార్పస్ఫండ్ కాపీని ఇవ్వాలి.
* కళాశాలను తరలించేందుకు కారణాలు సూచిస్తూ కళాశాల గవర్నింగ్ బాడీ తీర్మానం ఉండాలి.
* తరలించేందుకు ఒక కళాశాలకు తనిఖీ నిమిత్తం రుసుం రూ.27 వేలు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,500 ప్రభుత్వానికి చెల్లించాలి.
* భూమి, భవనాలకు సంబంధించిన రిజిస్టర్డ్ ప్రణాళిక ఉండాలి.
* మెడికల్ అధికారి జారీచేసిన శానిటరీ ధ్రువపత్రం, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి.
* విజయనగరంలోని శ్రీరాంనగర్ కాలనీలో అనుమతి పొందిన ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల నగరానికి నడిబొడ్డున పదేళ్లకు పైగా నడుస్తోంది. రోడ్లు విస్తరణ నేపథ్యంలో కళాశాలను ఆరేళ్ల కిందట సమీపంలోని వేరే చోటికి తరలించారు. బోర్డు నిబంధనల ప్రకారం తగిన రుసుం చెల్లించి, ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఇవేవీ చేయకపోవడంతో తాజాగా ఈ ఏడాదీ ఆ కళాశాలకు ఇంటర్మీడియేట్ బోర్డు నోటీసు జారీ చేసింది.
* విజయనగరం పీఎస్ఆర్ కాంప్లెక్స్లో అనుమతిపొందిన రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రస్తుతం తోటపాలెం, రింగురోడ్డులో తరగతులు నిర్వహిస్తున్నాయి. అయిదేళ్లకుపైగా కొనసాగుతున్నాయి. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకపోవడంతో వాటికి నోటీసులు జారీ అయ్యాయి.
* పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం బైపాస్కాలనీలో ఉండాల్సిన ఒక కళాశాల ఉన్న చోట కాకుండా వేరే చోట తరగతుల్ని నిర్వహిస్తోంది. ఎస్.కోట విశాఖరోడ్లో నిర్వహించాల్సిన ఓ కళాశాల గాయత్రినగర్లో తరగతులు కొనసాగిస్తుండటం గమనార్హం.
* చీపురుపల్లిలో ఓ కళాశాల కాంప్లెక్స్ పరిసరాల్లో అనుమతి పొంది, శివరాంరోడ్డులో కొనసాగుతోంది. అదే ప్రాంతంలో అనుమతి పొందిన ఇంకో కళాశాల వేరోచోట తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు