ఉగాదికి గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి
రానున్న ఉగాది నాటికి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని కలెక్టరు సూర్యకుమారి అధికారులను ఆదేశించారు.
చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సూర్యకుమారి
చీపురుపల్లి, న్యూస్టుడే: రానున్న ఉగాది నాటికి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని కలెక్టరు సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. చీపురుపల్లి మండల పరిషత్తు కార్యాలయలో చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్తగా వివాహమైన మహిళలు, తల్లి కాబోతున్న వారితో సహేలి గ్రూపులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంలో వైద్య శాఖాధికారులదే కీలక పాత్రన్నారు. సమావేశానికి హాజరైన అధికారులందరికీ హిమోగ్లోబిన్ పరీక్షలు జరపాలని కలెక్టరు ఆదేశించడతో వైద్య సిబ్బంది అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించారు. చీపురుపల్లి ఆర్డీఓ అప్పారావు, డీఎంహెచ్వో ఎస్వీ రమణ కుమారి, డీఈవో లింగేశ్వరరెడ్డి, గృహనిర్మాణ సంస్థ పీడీ రమణమూర్తి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!