తీర్మానాలు లేకుండా ఎలా ఖర్చు చేశారు?
బొబ్బిలి పురపాలికలో సభ్యులు వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ సభ్యులు పురపాలికలో అవినీతి ఎక్కువవుతోందని వారు కొన్ని అంశాలను ఆరోపించారు.
బొబ్బిలి పురపాలికలో సభ్యుల మండిపాటు
దోషులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంబంగికి వినతిపత్రం ఇస్తున్న అధికార పార్టీ కౌన్సిలరు గోవింద
బొబ్బిలి, న్యూస్టుడే: బొబ్బిలి పురపాలికలో సభ్యులు వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ సభ్యులు పురపాలికలో అవినీతి ఎక్కువవుతోందని వారు కొన్ని అంశాలను ఆరోపించారు. కమిషనర్, పుర అధ్యక్షులు వాహనాలు అద్దెకు తీసుకొని కౌన్సిల్ తీర్మానం లేకుండా నెలకు రూ.34 వేల నుంచి రూ.35 వేల చొప్పున ఎలా డ్రా చేస్తున్నారని నిలదీశారు. అద్దె వాహనాల్లో తిరుగుతున్నట్లు చూపితే పురపాలికకు చెందిన డ్రైవర్లు, ఇంధనాన్ని ఎలా వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మొత్తాలు సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని డిమాండు చేశారు. పురపాలికకు చెందిన ఓ వాహనం నాలుగు నెలలుగా మూలన ఉంటే తిప్పుతున్నట్లు ఇంధన ఖర్చులు ఎలా చూపారని వారు మండిపడ్డారు. పురపాలకకు చెందిన ప్రధాన తాగునీటిపైపులు 20 వరకు మార్చి కొత్తవి వేశారని, పాత వాటిలో ఎనిమిది పైపులు మాయమయ్యాయని, వాటి సంగతి తేల్చాలని డిమాండు చేశారు. గౌరవం ఇవ్వడం లేదని అధికార పార్టీ కౌన్సిలర్లు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా విభాగం చూసే ఇంజినీరును సస్పెండ్ చేయాలని డిమాండు చేయగా.. ముందుగానే సంబంధిత ఏఈ సెలవులో వెళ్లిపోయారు. అధికారులు సభ ప్రారంభంలోనే సభ్యులతో సంతకాలు చేయించడంతో అజెండా ఆమోదమైనట్లు చూపించడం, బడ్జెట్ను కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చూపించడం గమనార్హం.
కౌన్సిలర్ల వాకౌట్తో ఖాళీగా కనిపించిన కుర్చీలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ