logo

తండ్రీకొడుకులకు ఏడాది జైలు

ఉద్యోగం ఇప్పిస్తామని రూ.4 లక్షలు కాజేసి మోసగించిన ఘటనలో రాజాం మండలం గెడ్డవలసకు చెందిన తండ్రీకొడుకులు బూరాడ చిన్నంనాయుడు, శ్రీనివాసరావులకు ఏడాది.

Published : 01 Feb 2023 03:06 IST

రేగిడి, న్యూస్‌టుడే: ఉద్యోగం ఇప్పిస్తామని రూ.4 లక్షలు కాజేసి మోసగించిన ఘటనలో రాజాం మండలం గెడ్డవలసకు చెందిన తండ్రీకొడుకులు బూరాడ చిన్నంనాయుడు, శ్రీనివాసరావులకు ఏడాది జైలు శిక్ష, చెరో రూ.వెయ్యి జరిమానా విధిస్తూ రాజాం కోర్టు జడ్జి కృష్ణసాయితేజ మంగళవారం తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. రేగిడి మండలం అంబకండికి చెందిన జోగ కనకయ్యకు ఉద్యోగం ఇప్పిస్తామని తండ్రీకొడుకులు మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ కేసును ఏపీపీ కిమిడి సూర్యకుమార్‌ వాదించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని