logo

పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

ఇంట్లో నగదు వాడుకున్నాననే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది.

Published : 01 Feb 2023 03:06 IST

గంట్యాడ, న్యూస్‌టుడే: ఇంట్లో నగదు వాడుకున్నాననే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. మధుపాడ గ్రామానికి చెందిన నొట్ల శంకరరావు(32) ఈ నెల 28న స్థానిక పొలంలో అపస్మారక స్థితికి పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. అయితే జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఇంట్లో ఉంచిన రూ.40 వేలను తమకు తెలియకుండా వాడుకున్నాడని, ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి సూరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోద చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని