logo

వైభవంగా వ్యాకులమాత యాత్ర

కొత్తవలస మండలంలోని గొల్లలపాలెం వద్ద కొండడాబాలు పుణ్యక్షేత్రంలో వ్యాకులమాత యాత్ర మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది.

Published : 06 Feb 2023 04:31 IST

కొండడాబాలుకు పోటెత్తిన భక్తజనం

దివ్య పూజాబలి నిర్వహిస్తున్న విశాఖ అతిమేత్రాణులు ప్రకాష్‌, గురువులు

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలస మండలంలోని గొల్లలపాలెం వద్ద కొండడాబాలు పుణ్యక్షేత్రంలో వ్యాకులమాత యాత్ర మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి  విశ్వాసులు తరలిరావడంతో పరిసరాలు కిక్కిరిశాయి. ప్రధానమైన ఫోంటిఫికల్‌ దివ్య పూజాబలిని విశాఖ అతిమేత్రాణులు డాక్టర్‌ మల్లవరపు ప్రకాష్‌ నిర్వహించి దైవ సందేశం ఇచ్చారు.  కథోలిక్‌లకు దిశానిర్దేశం చేశారు. విచారణకర్త గురుశ్రీ గొంగాడ రాజు ఆధ్వర్యంలో ఉదయం 4, 5, 6, 7, 11 గంటలకు, మధ్యాహ్నం 3, సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలను గురువులు నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. మామిడితోటల్లో వంటలు చేసుకుని భోజనాలు చేశారు. సాయంత్రం వ్యాకులమాత తీర్థానికి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును సన్మానించారు.  పీహెచ్‌సీ వైద్యాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ ఎస్‌.బాలసూర్యారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విజయనగరం నుంచి డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

కొండడాబాలుకు తరలి వచ్చిన విశ్వాసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని