పేదల కంది పప్పు పక్కదారి!!
పేదలకు పౌరసరఫరాల శాఖ అందిస్తున్న కందిపప్పు పక్కదారి పడుతోంది. ఈ చిత్రంలో రోడ్డుపై కనిపిస్తున్న ఖాళీ సంచులే అందుకు నిదర్శనం.
పేదలకు పౌరసరఫరాల శాఖ అందిస్తున్న కందిపప్పు పక్కదారి పడుతోంది. ఈ చిత్రంలో రోడ్డుపై కనిపిస్తున్న ఖాళీ సంచులే అందుకు నిదర్శనం. రేషన్ కార్డున్న వారందరికీ చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం, నూనె, కంది పప్పు, పంచదార తదిరాలను రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. అయితే కొన్నిచోట్ల అవి పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొబ్బిలిలోని మేదరబంద సమీపంలోగల పురపాలిక వాణిజ్య సముదాయాల మెట్ల వద్ద కంది పప్పు ప్యాకెట్ల ఖాళీ సంచులు పడిఉన్నాయి. పప్పును వేరే కవర్లలోకి మార్చి వ్యాపారులు తెలివిగా విక్రయిస్తున్నారని పలువురు చెబుతున్నారు. రేషన్ దుకాణాల ద్వారా కిలో రూ.67లకు పప్పు ఇవ్వగా, బయట మార్కెట్లో రూ.90 నుంచి రూ.95 వరకు ధర పలుకుతోంది. అంగన్వాడీ కేంద్రాలకూ సరఫరా చేస్తుండడంతో ఈ కేంద్రాల నుంచి వెళ్లాయా? రేషన్ దుకాణాల నుంచి వెళ్లాయా? అన్నది తెలియాల్సి ఉంది. కొన్నిచోట్ల చక్కెర ప్యాకెట్లు ఇలాగే దారిమళ్లుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీనిపై పౌరసరఫరాల ఉప తహసీల్దారు సాయికృష్ణ వివరణ కోరగా ఆ సంచులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూస్టుడే, బొబ్బిలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
[ 20-04-2024]
ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం. -
తోటపల్లి పార్కు జీవం తీసేశారు
[ 20-04-2024]
మన్యంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తెదేపా హయాంలో 2016-17 మధ్య తోటపల్లి ప్రాజెక్టు గట్టుకు ఆనుకొని ఐటీడీఏ ఆధ్వర్యంలో పార్కు ఏర్పాటు చేశారు. -
అయిదేళ్లలో బొత్స సోదరుల ఆస్తులు రెట్టింపు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు అధిక సంఖ్యలోనే దాఖలయ్యాయి. శృంగవరపుకోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అఫిడవిట్ దాఖలు చేయలేదు. -
వాహనాల్లో కుక్కేశారు.. ట్రాఫిక్లో ఉంచేశారు
[ 20-04-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు. -
తరలింపు వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
[ 20-04-2024]
నామినేషన్ ఘట్టానికి వైకాపా కార్యకర్తలను తరలించిన ఆటో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రాజాన దిలీప్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. -
ఉల్లంఘనలు కనిపించడం లేదా?
[ 20-04-2024]
పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు ఏం చేసినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. -
ప్రజలకు జగనన్న షాక్
[ 20-04-2024]
తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా బాకా ఊదారు సీఎం జగన్. బాదుడే.. బాదుడు అంటూ అప్పటి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేశారు. దీంతో నిజమని నమ్మేశారు కొందరు ప్రజలు. -
చందనోత్సవ వైఫల్యాలపై నివేదిక ఏదీ..?: అశోక్
[ 20-04-2024]
సింహాచలం దేవస్థానంలో గతేడాది చందనోత్సవ సమయంలో జరిగిన వైఫల్యాలపై చేపట్టిన విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్
[ 20-04-2024]
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్కు రోజులు దగ్గర పడ్డాయని, వైకాపా వచ్చిన తర్వాత దోపిడీ ఎక్కువైందని చీపురుపల్లి ఎన్డీయే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!