హరిత శోభిత రహదారి
భారతమాల ప్రాజెక్టు ఫేజ్-1 కింద ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ రాయపూర్-విశాఖ మధ్య ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను కేంద్రం చేపట్టింది.
ఉభయ జిల్లాలకు ఉపయోగం
జామి వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి
పేరు: రాయపూర్- విశాఖపట్నం (ఎకనామిక్ కారిడార్) గ్రీన్ఫీల్డ్ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే
అంచనా వ్యయం: రూ.20,000 కోట్లు రోడ్డు నంబరు: ఎన్హెచ్-130 సీడీ అండ్ ఈసీ-157
పొడవు: 464.662 కి.మీ వెడల్పు: ఆరు వరుసలు, 60 మీటర్లు నిధులు: ఏడీబీ
న్యూస్టుడే, కొత్తవలస: భారతమాల ప్రాజెక్టు ఫేజ్-1 కింద ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ రాయపూర్-విశాఖ మధ్య ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను కేంద్రం చేపట్టింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా ఈ రోడ్డు రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం రాయపూర్- విశాఖ మధ్య విజయనగరం, గజపతినగరం, సాలూరు మీదుగా ఉన్న జాతీయ రహదారితో సంబంధం లేకుండా గ్రీన్ఫీల్డు రోడ్డును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రయాణ సమయం 13 నుంచి 14 గంటలు పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా గంటకు 40 నుంచి 100 కి.మీ వేగంతో ప్రయాణించేలా కొత్త మార్గం రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల ప్రయాణ సమయం 6-7 గంటలకు తగ్గుతుందని అంచనా. ఫలితంగా ఇంధన వినియోగం, ప్రయాణ ఖర్చు కలిసొస్తుంది. 2025 నాటికి సిద్ధం చేయాలన్నది గడువు కాగా ఆంధ్రప్రదేశ్లో 2024 అక్టోబరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.దీన్ని అనకాపల్లి జిల్లా సబ్బవరం వద్ద అనకాపల్లి-రాజాపులోవ ఎన్హెచ్కు కలుపుతారు.
వర్చువల్లో ప్రధాని మోదీ ప్రారంభించిన శిలాఫలకం
ఉమ్మడి జిల్లాల్లో గతేడాది నవంబరు 12న పనులను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇక్కడ రూ.3,800 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న రోడ్డు కోసం 800 హెక్టార్ల భూములను సేకరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 11 కి.మీ పొడవున అటవీ భూములున్నాయి. అవసరమైన చోట పంట పొలాలకు, ఇతరత్ర నీటి ప్రవాహానికి అనుగుణంగా చిన్న వంతెనలు, నదులు, గెడ్డలపై పెద్ద వంతెనలు, అండర్/ఓవర్ పాస్లు నిర్మిస్తున్నారు.
అంతర రోడ్ల అనుసంధానం
రెండు జిల్లాల్లో ఆరు చోట్ల అంతర అనుసంధాన మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మొదటిది అనకాపల్లి జిల్లా సబ్బవరం బైపాస్ చివరి నుంచి గుల్లిపల్లి-మొగలిపురం మధ్యలో, రెండోది కొత్తవలస మండలం దత్తి వద్ద, మూడోది జామి మండల కేంద్రంలో, నాలుగోది గంట్యాడ మండలం కొర్లాం సమీపంలో విజయనగరం 516ఈ రోడ్డు క్రాస్ వద్ద, ఐదోది మెంటాడ మండలం మూసూరు వద్ద, ఆరోది సాలూరు వెళ్లే దారిలో మాతుమూరు వద్ద అంతర రోడ్లను అనుసంధానిస్తున్నారు.
లక్కవరపుకోట మండలం నిడుగట్టు వద్ద గెడ్డపై నిర్మిస్తున్న వంతెన
ప్రధాన ఉద్దేశమిది
ప్రధానంగా కార్గో సేవల కోసం హరిత రహదారిని ఉద్దేశించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న బాక్సైట్, ఐరన్ ఓర్, లైమ్స్టోన్ వంటి ఖనిజ ముడిసరకులను విశాఖ పోర్టుకు రవాణా చేయడానికి వీలుగా ప్రతిపాదించారు. ఈ మార్గం జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఐదు చోట్ల విశ్రాంతి కేంద్రాలు
ఉభయ జిల్లాల పరిధిలో ఐదుచోట్ల రహదారి పక్కన వాహన చోదకులు, ప్రయాణికులకు విశ్రాంతి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతి 100 కి.మీ దూరంలో ‘రెస్టు ఏరియా’ పేరిట స్టాపేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ బంకు, విశ్రాంతి తీసుకోవడానికి వసతులు, ఫలహార-భోజనశాలలు, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. కొత్తవలస మండలం గులివిందాడ-చీపురువలస మధ్య, గంట్యాడ మండలం కొర్లాం వద్ద టోల్ప్లాజాలు ఏర్పాటు చేస్తున్నారు.
చినరావుపల్లి-మల్లివీడు మధ్య నిడుగట్టు వద్ద నిర్మించిన ఓవర్ పాస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ