logo

రీసర్వేలో జిల్లా ప్రథమం

భూముల రీసర్వేలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కేఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్‌ సూర్యనారాయణ తెలిపారు.

Published : 30 Mar 2023 02:30 IST

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: భూముల రీసర్వేలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కేఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్‌ సూర్యనారాయణ తెలిపారు. ఆయన తహసీల్దారు కార్యాలయంలో సర్వే తీరును సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సర్వే వేగవంతం చేయడంతో పాటు రైతుల సమస్యలు పరిష్కరించడంలో జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లాలో 983 గ్రామాలకు గానూ మొదటి విడతలో 179 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామన్నారు. రెండో విడతలో 311 గ్రామాల్లో జరుగుతోందని, ఎక్కువ గ్రామాల్లో సర్వే చేయడంలో ద్వితీయ స్థానంలో ఉందన్నారు. ఏప్రిల్‌ చివరినాటికి పూర్తి చేస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు