logo

దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సహించడం తగదు

అమరావతి రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచిన భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, కార్యకర్తలపై దాడికి పాల్పడిన వైకాపా నాయకులపై కేసులు పెట్టాలని భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని డిమాండు చేశారు.

Published : 02 Apr 2023 05:47 IST

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న భాజపా, జనసేన నాయకులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: అమరావతి రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచిన భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, కార్యకర్తలపై దాడికి పాల్పడిన వైకాపా నాయకులపై కేసులు పెట్టాలని భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని డిమాండు చేశారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట భాజపా కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు కూడా గూండాలకు మద్దతు పలకడం, దాడికి పాల్పడిన వైకాపా వారిని ప్రోత్సహించడం తగదన్నారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలియజేసేందుకు వెళ్లిన తమ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తీగల హరనాథ్‌, గద్దే బాబూరావు, సుబ్బారావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బూర్లి శ్రీధర్‌, నాయకులు అప్పలాచారి, ఉత్తరవల్లి మోహనరావు, సుధీర్‌, వినీత, పద్మ, జనసేన నాయకులు రాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని