మాల్ప్రాక్టీసుకు పాల్పడితే కఠిన చర్యలు
జిల్లాలో ఈ నెల 3 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.
చరవాణి, డిజిటల్ వాచీలు నిషేధం
హాల్టికెట్ ఉంటే పల్లెవెలుగులో ఉచిత ప్రయాణం
‘న్యూస్టుడే’తో డీఈవో లింగేశ్వరరెడ్డి
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: జిల్లాలో ఈ నెల 3 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. చరవాణి, డిజిటల్ వాచీలకు అనుమతి లేదని, మాల్ప్రాక్టీసుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఈ ఏడాది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నామని ఆయన ‘న్యూస్టుడే’కు పలు విషయాలను తెలిపారు.
* రెగ్యులర్ విద్యార్థులు 24,099 మంది, ప్రైవేట్గా 1428 మంది పరీక్ష రాయనున్నారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు జరుగుతాయి. ఎవరైనా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోకపోతే వారికి ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి ఇవ్వాలని ఆదేశించాం.
బెంచీకి ఒక్కరే..: చిన్నగా ఉన్న చోట బెంచీకి ఒక్కరు, ఎంపీల్యాడ్స్ ద్వారా ఇచ్చిన బెంచీలు పెద్దవి కావడంతో ఇద్దరేసి రాస్తారు. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్ల సదుపాయం, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాం. నాడు నేడు పనులు జరిగే చోట పరీక్షా కేంద్రాలు లేవు. అవి ఉన్నట్లు మా దృష్టికైతే రాలేదు. పరీక్ష వేళల్లో బస్సులు తిరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. పల్లెవెలుగు బస్సుల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పరీక్షకు ఉచితంగా వెళ్లొచ్చు.
పర్యవేక్షణ ఇలా..: ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాం. 35 ‘సి’ కేటగిరీ కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తారు. ప్రతి కేంద్రానికి ఒక ముఖ్య పర్యవేక్షకుడు, విభాగాధికారులు ఉంటారు. 1311 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. కస్టోడియన్ల ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాలు ఇప్పటికే 29 స్టోరేజీ పాయింట్లకు తరలించాం. పరీక్షలు జరిగే 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్ దుకాణాలు, అంతర్జాల కేంద్రాలను మూసేయాలని ఆదేశించాం. ప్రాంగణంలోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్మెంట్ అధికారులు ఏ ఒక్కరూ చరవాణిని తీసుకురాకూడదు. డిజిటల్ వాచీలను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రంలో తిరిగే అధికారులు, ఇన్విజిలేటర్లకు ఐడీ కార్డులు తప్పనిసరి చేశాం.
ప్రశ్నపత్రాలకు వరుస నంబరు: తొలిసారిగా ప్రశ్నపత్రాలకు సీరియల్ నంబరు ఉంటుంది. పరీక్షకు హాజరుకాని వారి ప్రశ్నపత్రాలు పక్కన పెడతాం. 24 పేజీల బుక్లెట్ రూపంలో సమాధాన పత్రం ఉంటుంది. అదనంగా కావాలంటే 12పేజీల బుక్లెట్ ఇస్తారు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులకు వేర్వేరుగా సమాధాన పత్రాలు ఇస్తాం. విద్యార్థులు సమాధానాలు రాసేటపుడు ఇచ్చిన సబ్జెక్టుకు సంబంధించి బుక్లెట్లోనే రాయాలి. ఈ మేరకు విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించాం. గ్రాఫ్, మ్యాప్ పాయింటింగ్ మీద పేరు రాయకూడదు. సీరియల్ నంబరు మాత్రమే వేయాలి.
కోటలో కంట్రోల్రూం: పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే కోటలోని పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. విద్యార్థులు, తల్లిదండ్రులు 90009 45346 నంబరుకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చు. తక్షణమే చర్యలు తీసుకుంటాం.
పరిశీలకురాలిగా గీత: కేజీబీవీ సంయుక్త కార్యదర్శి ఎన్.గీత పరిశీలకురాలిగా నియమితులయ్యారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఆమె పర్యటించి పరీక్షలు జరిగే తీరును పర్యవేక్షిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యర్థుల ఖర్చు వారి ఖాతాల్లోనే జమ
[ 20-04-2024]
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనందకుమార్, ఆకాష్దీప్ ఆదేశించారు. -
ఎన్నికల హోరు.. నామినేషన్ల జోరు
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. శుక్రవారం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి 6, అసెంబ్లీ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. -
కదిలిన పసుపు దండు
[ 20-04-2024]
జిల్లా కేంద్రం శుక్రవారం పసుపుమయమైంది. తెదేపా నుంచి ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ వేసేందుకు అశోక్ బంగ్లాకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. -
ఎస్ కోటలో 22న చంద్రబాబు పర్యటన
[ 20-04-2024]
శృంగవరపుకోట పట్టణంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన 22వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఖరారు అయింది. ముందుగా 21వ తేదీన పర్యటన ఉంటుందని సమాచారం వచ్చింది. -
బొబ్బిలిలో మార్పు మొదలైంది
[ 20-04-2024]
బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వైకాపా నుంచి తెదేపాలోకి పలువురు వాలంటీర్లు, ముఖ్య నేతలు చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి పలువురు వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
అయిదేళ్లలో బొత్స సోదరుల ఆస్తులు రెట్టింపు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు అధిక సంఖ్యలోనే దాఖలయ్యాయి. శృంగవరపుకోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అఫిడవిట్ దాఖలు చేయలేదు. -
వాహనాల్లో కుక్కేశారు.. ట్రాఫిక్లో ఉంచేశారు
[ 20-04-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు. -
తరలింపు వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
[ 20-04-2024]
నామినేషన్ ఘట్టానికి వైకాపా కార్యకర్తలను తరలించిన ఆటో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రాజాన దిలీప్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. -
ఉల్లంఘనలు కనిపించడం లేదా?
[ 20-04-2024]
పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు ఏం చేసినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. -
ప్రజలకు జగనన్న షాక్
[ 20-04-2024]
తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా బాకా ఊదారు సీఎం జగన్. బాదుడే.. బాదుడు అంటూ అప్పటి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేశారు. దీంతో నిజమని నమ్మేశారు కొందరు ప్రజలు. -
చందనోత్సవ వైఫల్యాలపై నివేదిక ఏదీ..?: అశోక్
[ 20-04-2024]
సింహాచలం దేవస్థానంలో గతేడాది చందనోత్సవ సమయంలో జరిగిన వైఫల్యాలపై చేపట్టిన విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. -
ఉప్పొంగిన అభిమానం
[ 20-04-2024]
రాజాం పట్టణం జనసంద్రమైంది. కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ నామినేషన్ సందర్భంగా మండుటెండను సైతం లెక్క చేయకుండా వివిధ మండలాల నుంచి చేరుకున్న వేలాది మంది గంటల కొద్దీ ర్యాలీలో పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్
[ 20-04-2024]
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్కు రోజులు దగ్గర పడ్డాయని, వైకాపా వచ్చిన తర్వాత దోపిడీ ఎక్కువైందని చీపురుపల్లి ఎన్డీయే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే