logo

వైభవం.. భీమసింగి వెంకన్న కల్యాణం

భీమసింగి సహకార చక్కెర కర్మాగారంలోని వేంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సింహాచలం దేవస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Published : 02 Jun 2023 03:12 IST

జామి, న్యూస్‌టుడే: భీమసింగి సహకార చక్కెర కర్మాగారంలోని వేంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సింహాచలం దేవస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్లకు మేలుకొలుపు కార్యక్రమం చేశారు. అనంతరం కల్యాణ క్రతువులో జీలకర్ర- బెల్లం, తలంబ్రాలు, మంగళ సూత్రధారణ వంటివి జరిపించారు. కర్మాగార ఎండీ విక్టర్‌రాజు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య భార్య దేవి అనూరాధ, జామి జడ్పీటీసీ సభ్యురాలు గొర్లె సరయు, ఎంపీపీ అరుణ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని