రైతు భరోసాతో పెరిగిన సాగు విస్తీర్ణం
రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ.13,500 అందిస్తుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
బొబ్బిలి గ్రామీణం, న్యూస్టుడే: రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ.13,500 అందిస్తుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం బొబ్బిలి మండల పరిషత్తు కార్యాలయం వద్ద జిల్లాస్థాయి రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అధ్యక్షతన జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. అయిదో ఏడాది మొదటి విడత సాయాన్ని రూ.5,500 చొప్పున అందించామన్నారు. దీంతో సాగు పెట్టుబడికి రైతులు బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరగాల్సిన అవసరం లేదని, బంగారం తాకట్టు పెట్టాల్సిన పని లేదన్నారు. దళారుల బారిన పడకుండా ఆర్బీకేల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో నగదు చెల్లిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 2,58,300 మంది రైతులకు రూ.193.74 కోట్లు, వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులు 2235 మందికి పెట్టుబడి రాయితీ రూ.73,42,000 చెక్కులను అందజేశారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం రైతుల బకాయిలు, సంకిలి కర్మాగారానికి చెరకు తరలించే రైతులకు నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పశువైద్యానికి సంచార వాహనాలు
పశువులకు అత్యవసర చికిత్స కోసం మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే శంబంగి అన్నారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఖరీఫ్లో ఆరున్నర లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.12 వేల కోట్లు, చెరకు రైతులకు రూ.30 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు భద్రపరుచుకోవడానికి పీఏసీఎస్ పరిధిలో గోదాములు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, జేడీ రామారావు, ఆర్డీవో శేషశైలజ, ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసరావు, బుడా ఛైర్మన్ ఇంటి పార్వతి, మున్సిపల్ ఛైర్మన్ వెంకట మురళీకృష్ణ, ఏడీఏ మజ్జి శ్యామ్సుందర్, వైకాపా మండల అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
[ 19-04-2024]
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె