కొలిక్కిరాని బదిలీలు
ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ రెండో రోజూ కొలిక్కిరాలేదు. బుధవారం అర్ధరాత్రి వరకూ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం కోసం గురువారం సాయంత్రం వరకు నిరీక్షించారు.
ఇదీ పరిస్థితి
* విద్యాశాఖలో ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాపై 357 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నివృత్తి అనంతరం శుక్ర, శనివారాల్లో తుది సీనియార్టీ జాబితాలు వెల్లడించనున్నట్లు శాఖావర్గాలు ప్రకటించాయి.
* రెవెన్యూలో తొమ్మిది మంది తహసీల్దార్లు, 17 మంది ఉప తహసీల్దార్లకు స్థానచలనమైంది. సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, వీఆర్వోల విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
* ఖజానా శాఖలో సబార్డినేట్ నుంచి సీనియర్ సహాయకుని వరకు ఆరుగురికే బదిలీలయ్యాయి. రాష్ట్రస్థాయిలో డీడీ, ఏటీవో కేడర్ల ప్రక్రియ సాగుతోందని ఇన్ఛార్జి డీడీ కుమార్ తెలిపారు.
* జిల్లా పరిషత్తు, పంచాయతీరాజ్, వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి వివరాలు రాలేదు.
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ రెండో రోజూ కొలిక్కిరాలేదు. బుధవారం అర్ధరాత్రి వరకూ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం కోసం గురువారం సాయంత్రం వరకు నిరీక్షించారు. కొన్నిశాఖలకు సంబంధించిన వాటిని మాత్రమే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇంకా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం గడువు నిర్దేశించినా రెండు మూడు రోజుల సమయం పడుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు.
నేటి నుంచి అధ్యాపకులకు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది శుక్రవారం నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. జిల్లాలో అయిదేళ్లు నిండిన వారు 28 మంది ఉన్నారు. వీరు తప్పక బదిలీ కానున్నారు. సున్నా సర్వీసు వారికీ అవకాశం ఉందని డీవీఈవో సురేష్కుమార్ తెలిపారు.
టీపీబీవోకు ఉద్యోగోన్నతి
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో టీపీబీవో(టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్)గా పనిచేస్తున్న ఫిలిప్కు ఉద్యోగోన్నతి లభించింది. టీపీఎస్(టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్)గా శ్రీకాకుళం పురపాలక సంస్థకు ఆయన బదిలీపై వెళ్లనున్నారు. విజయనగరంలోనే కొనసాగే విధంగా ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు వెళ్లినట్లు సమాచారం.
‘ వెలుగు’లో..
మయూరికూడలి, న్యూస్టుడే: సెర్ప్ శాఖ ఆదేశాల మేరకు వెలుగు విభాగంలో బదిలీలు జరిగాయి. మొత్తం 28 మందికి స్థానచలనమైనట్లు డీఆర్డీఏ పీడీ కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో వర్కు ఆర్డర్లు ఇచ్చి, ప్రాంతాలు కేటాయించారు.
జిల్లా రిజిస్ట్రార్కు..
విజయనగరం కోట, న్యూస్టుడే: విజయనగరం జిల్లా రిజిస్ట్రార్ ఎం.సృజనకు విశాఖపట్నం బదిలీ అయింది. ఈమె స్థానంలో విజయవాడలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో ఏఐజీగా పనిచేస్తున్న ఎ.వి.కుమారి రానున్నారు.
విజయవాడకు ఆర్అండ్బీ ఎస్ఈ
కోట, న్యూస్టుడే: రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్(ఎస్ఈ) వి.కె.విజయశ్రీ విజయవాడ సర్కిల్కు బదిలీ అయ్యారు. ఒంగోలు ఎస్ఈ కె.విజయరత్నంను ఆమె స్థానంలో నియమించారు. ఆర్అండ్బీ డీఈ ఎ.అప్పలనాయుడును జిల్లాలోని క్వాలిటీ కంట్రోల్ విభాగానికి పంపించారు. అక్కడ పనిచేస్తున్న సి.హెచ్.విద్యావాణి గజపతినగరం డీఈగా నియమితులయ్యారు. విజయనగరం జేఈ నందకుమార్ ఇక నుంచి భోగాపురంలో విధులు నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ