ఆ పోస్టులు ఇక ఉండవ్
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.
కేజీబీవీల్లో కొలువుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 33 విద్యాలయాలకు 123 మంది అధ్యాపకులు రానున్నారు. అర్హులైన వారు ఈ నెల అయిదో తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అయితే హేతుబద్ధీకరణ, అతిథి బోధకుల తొలగింపు వంటి చర్యలతో నిరుద్యోగ అభ్యర్థినులకు కొంత నష్టం చేకూరుతోంది.
ఎప్పటికప్పుడే..
2018-19లో సీఆర్టీల నియామకానికి కృపా ఏజెన్సీ ద్వారా ప్రకటన ఇచ్చారు. ఎంపిక అనంతరం వారిని ఒప్పంద ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకున్నారు. 2021-22లో జిల్లాస్థాయిలో 132 ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు చేపట్టారు. తుది జాబితాను ప్రకటించిన సమయంలో ధ్రువపత్రాలపై ఆరోపణలు రావడంతో నియామకాలు రద్దు చేశారు. అప్పట్లో 2,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పట్లో అతిథి బోధకులను నియమించారు. వీరిని 2022-23 విద్యాసంవత్సరం చివరి రోజు తొలగించారు. కొత్తగా వచ్చే వారిని కూడా తొలగిస్తారేమోనన్న ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
రాష్ట్రస్థాయి నుంచే జాబితా
* దరఖాస్తుల మేరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం 1:3 నిష్పత్తిలో రాష్ట్రస్థాయిలో మెరిట్ జాబితాను తయారు చేసి జిల్లాలోని ఎంపిక కమిటీకి పంపిస్తారు.
* అక్కడ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. నైపుణ్య, వ్యక్తిత్వ పరీక్ష నిర్వహణ ఆధారంగా కమిటీ ఆమోదంతో తుది జాబితాను ప్రకటిస్తారు.
* అతిథి బోధకులకు సంబంధించి ఒక సంవత్సరంలో ఆరు నెలలు పైబడి కేజీబీవీల్లో పనిచేస్తే ఒక సంవత్సరంగా పరిగణించి 0.5 మార్కులు కేటాయిస్తారు.
సర్దుబాటా.. తొలగింపా
హేతుబద్ధీకరణతో తెలుగు, ఆంగ్లం పోస్టులు రద్దు కానున్నాయి. పీజీటీలో తెలుగు, బైపీసీ గ్రూపు ఉన్నచోట ఆంగ్లం పోస్టులు రద్దయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పనిచేస్తున్న వారిని సర్దుబాటు చేస్తారా? తొలగిస్తారా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. ఒక కేజీబీవీలో ప్రిన్సిపల్, పీఈటీ, నాలుగు పీజీటీ, ఏడు సీఆర్టీ పోస్టులు మాత్రమే ఉంటాయి. సీఆర్టీలతోనే పీజీటీ తెలుగు, బైపీసీలో ఏదో సబ్జెక్టు చెప్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది.
దళారులను నమ్మొద్దు
- బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రకటన కోసం apkgbv.apcfss.in వెబ్సైట్ను సంప్రదించాలి. పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది. నిబంధనల ప్రకారం మెరిట్ ప్రాతిపదికన ఎంపికలుంటాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే తన దృష్టికి తీసుకురావాలి. సందేహాలుంటే 08922-276404, 14400 టోల్ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు