డబ్బులు ఊరికే రావు.. ఇవీ అడగండి బాబూ..
పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తే రూ.110కిపైగా తీయాల్సిందే. డీజిల్ వేయిస్తే రూ.100 నోటు ఇచ్చేయాల్సిందే. కేవలం ఇంధనం కోసమే ఇంత ధర కాదండోయ్.. వినియోగదారులకు మరికొన్ని సదుపాయాలూ ఉన్నాయండోయ్..
న్యూస్టుడే, విజయనగరం నేరవార్తా విభాగం
పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తే రూ.110కిపైగా తీయాల్సిందే. డీజిల్ వేయిస్తే రూ.100 నోటు ఇచ్చేయాల్సిందే. కేవలం ఇంధనం కోసమే ఇంత ధర కాదండోయ్.. వినియోగదారులకు మరికొన్ని సదుపాయాలూ ఉన్నాయండోయ్.. బంకుల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా గాలి కొట్టడం, తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యత పరిశీలన.. తదితర సదుపాయాలు కల్పించాలి. ఇవేవీ లేకపోతే సంబంధిత వ్యక్తులపై తూనికలు- కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. మరి మీరివి సద్వినియోగం చేసుకుంటున్నారా? ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా..
ఉమ్మడి జిల్లా పరిధిలో 134 పెట్రోల్ బంకులున్నాయి. వీటిల్లో చాలాచోట్ల సౌకర్యాలు కానరావడం లేదు. మరుగుదొడ్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నా.. అవి కేవలం అక్కడ పనిచేసే సిబ్బందికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అలాగే తాగేందుకు నీరు ఉన్నట్లు ఖాళీ క్యాన్లు ఉంచుతున్నారు. గాలి ఉచితమని బోర్డులున్నా.. కొట్టేందుకు మనిషి కనిపించడు. తూకం పరికరం, పెట్రోల్ తెలుసుకునేందుకు నాణ్యత పేపర్ల ఊసే లేదు. ఈక్రమంలో వినియోగదారులు నష్టపోతున్నారు.
పాటించకపోతే చర్యలు..
వినియోగదారులకు సౌకర్యాలు కల్పించకపోతే తూనికలు- కొలతల శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారు. ఇటీవల అన్ని బంకులనూ పరిశీలించి, దాదాపు 25 కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. 2020-21లో 260 సార్లు, 2021-22లో 247, 2022- 23లో 399 సార్లు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. ఏడాదికి ఒక్కో బంకునూ దాదాపు 5 నుంచి 10 సార్ల వరకు పరిశీలిస్తున్నామని తూనికలు- కొలతల శాఖ మూడు జిల్లాల సహాయ సంచాలకుడు జనార్దనరావు తెలిపారు.
బోర్డులు తప్పనిసరి..
ఏ సౌకర్యం ఎక్కడ ఉందో తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అత్యవసర సేవల కోసం పట్టికలు పెట్టాలి. వాటి మీద ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు రాయాలి. ప్రతిజిల్లాలో ఆయిల్ కార్పొరేషన్ తరఫున ఒక అధికారి ఉంటారు. సదుపాయాలు కానరాకపోతే ఆయనకు తెలియజేయొచ్చు. స్పందించకపోతే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. తూకంలో తేడా ఉంటే తూనికలు- కొలతలశాఖ అధికారులకు, నాణ్యత లోపించినా, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు లేకపోతే పౌర సరఫరాలశాఖ సిబ్బందికి విన్నవించొచ్చని డీఎస్వో మధుసూదనరావు తెలిపారు. తమశాఖ తరఫున అప్రమత్తంగా ఉన్నామన్నారు.
నిబంధనలివీ..
* ప్రతి బంకు వద్ద ఉచితంగా గాలి కొట్టే సౌకర్యం కల్పించడంతో పాటు ఒక మనిషిని అందుబాటులో ఉంచాలి. డబ్బులు డిమాండ్ చేయరాదు.
* వినియోగదారులకు కనిపించేలా తాగేందుకు నీళ్లు ఉంచాలి.
* కొలతల్లో తేడాలను చూసుకునేందుకు తప్పనిసరిగా కొలత క్యాన్లను పెట్టాలి.
* నాణ్యత తెలుసుకునేందుకు లిట్మస్ పేపర్ ఉంచాలి. దాని మీద ఒక చుక్క ఆయిల్ పోశాక అది రంగు మారితే సరైన ఇంధనం కానట్లే.
* అందుబాటులో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వాటిని శుభ్రంగా ఉంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
[ 19-04-2024]
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM