logo

నేడు రైతులకు ట్రాక్టర్ల పంపిణీ

వైఎస్సార్‌ యంత్రసేవా పథకంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని రైతులకు ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఇవ్వనున్నారు.

Published : 02 Jun 2023 03:12 IST

విజయనగరం వ్యవసాయవిభాగం, పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ యంత్రసేవా పథకంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని రైతులకు ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి కోట ప్రాంతంలో వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. గురువారం సాయంత్రం అయోధ్య మైదానానికి వాహనాలు చేరుకున్నాయి. జిల్లాలోని 184 రైతు సంఘాలకు రూ.15.20 కోట్ల విలువైన రోటోవేటర్లు, నూర్పిడి యంత్రాలు, స్ప్రేయర్లు, పవర్‌వీడర్లు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, వాటితో నడిపే యంత్ర పరికరాలు ఇస్తారు. వాటిపై రూ.4.54 కోట్ల రాయితీ వర్తించనుంది. ఈ నిధులన్నీ సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో జమకానున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా అధికారులు హాజరు కానున్నారు. రి మన్యం జిల్లాలో 78 సంఘాలకు ఇవ్వనున్నట్లు వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌ చెప్పారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.15 లక్షలు ఉంటుందని, అందులో 40 శాతం రాయితీ, 50 శాతం బ్యాంకు రుణం, మరో 10 శాతం నిధులు గ్రూపు సభ్యులు చెల్లించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని