భానుడు భగభగ.. ఆరోగ్యానికి సెగ!
ఎండలు మండుతున్న నేపథ్యంలో సమతుల్యమైన జీవనశైలితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండలు మండుతున్న నేపథ్యంలో సమతుల్యమైన జీవనశైలితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం నుంచి ఆహారం వరకు అన్నిట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
వ్యాయామం: వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు బయట ఉష్ణోగ్రతలు కారణంగా చెమట రూపంలో లవణాలు బయటకు పోతాయి. ఈ నేపథ్యంలో సూర్యోదయంలోపే 45 నిమిషాలకు మించకుండా, మంచి శిక్షకుడి ఆధ్వర్యంలో వ్యాయామం పూర్తి చేయాలి.
నీళ్లు: ఎక్కువ శాతం నీటిని తాగడం వల్ల ప్రయోజనం తక్కువే. అలా కాకుండా కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తీసుకోవడం వల్ల చెమట రూపంలో పోయిన లవణాలు శరీరానికి తిరిగి అందుతాయి. ఎండలో పనిచేసే వారికి ఇవి మరింత అవసరం.
ఆహారం: అతిగా మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. తేలికపాటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. కూరగాయలతోపాటు మసాలాలు లేకుండా ఉడికించిన చేపలు, చికెన్ లాంటివి తీసుకోవచ్చు.
ఆటలు: పిల్లలు, పెద్దలు ఎండలో ఆటలు ఆడకపోవడమే మేలు. దీనివల్ల తీవ్రమైన డీహైడ్రేషన్కు గురవుతారు. సాయంత్రం వేళ వాతావరణం చల్లబడిన తర్వాతే పిల్లలను ఆటలకు పంపాలి. ఈత, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్కు ప్రాధాన్యం ఇవ్వడం మేలు.
ఏసీలు, కూలర్లు: ఏసీల్లో ఎక్కువ సమయం గడపటం వల్ల డ్రైఐస్ లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చల్లదనం వల్ల కొందరు నీళ్లు సక్రమంగా తీసుకోరు. ఫలితంగా యూరిన్ ఇన్ఫెక్షన్కు దారి తీస్తుంది. ఏసీల్లో ఫిల్టర్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కూలర్లలో దుమ్ము పట్టకుండా చూసుకోవాలి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె