వెళ్తున్నారు.. వస్తున్నారు
ఉమ్మడి జిల్లాలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని శాఖల్లో ఇంకా కొలిక్కిరావాల్సి ఉంది. ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులు శుక్రవారం ఇక్కడకు వచ్చారు.
కొనసాగుతున్న బదిలీలు
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని శాఖల్లో ఇంకా కొలిక్కిరావాల్సి ఉంది. ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులు శుక్రవారం ఇక్కడకు వచ్చారు. ఇంకొందరు బయట జిల్లాలకు వెళ్లారు.
కొన్నిశాఖల్లో ఇలా..
* జిల్లా పరిషత్తుకు సంబంధించి ఎంపీడీవోల బదిలీలు కొలిక్కి వచ్చాయి. 11 మందికి పదోన్నతులు దక్కాయి. జియ్యమ్మవలస ఎంపీడీవో విజయలక్ష్మిని బలిజిపేట మండలానికి బదిలీ చేసినట్లు జడ్పీ సీఈవో అశోక్కుమార్ తెలిపారు.
* భూముల సర్వేశాఖలో ముగ్గురు సర్వేయర్లు, అయిదుగురు ఉప సర్వేయర్లకు స్థానచలనమైంది.
* రెవెన్యూ, పంచాయతీశాఖల్లో జాబితాలు సిద్ధం చేసినప్పటికీ కొన్ని కేడర్లకే ఉత్తర్వులు అందజేశారు.
డీఎంహెచ్వో బాధ్యతల స్వీకరణ
వైద్యవిభాగం: వైద్యారోగ్యశాఖ విజయనగరం జిల్లా అధికారిగా ఎస్.భాస్కర్రావు తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేస్తున్న ఈయనను డీఎంహెచ్వో(పూర్తి అదనపు బాధ్యతలు)గా నియమించారు. ఇంతవరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్వీ.రమణకుమారి పదవీ విరమణ చేశారు.
సహాయ ఆడిట్ అధికారిణిగా..
విజయనగరం జిల్లా సహాయ ఆడిట్ అధికారిణిగా సి.హెచ్.ప్రభావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా జడ్పీ విభాగంలో సహాయ ఆడిట్ అధికారిణిగా పనిచేసి, ఇక్కడకు వచ్చారు. 2018 గ్రూప్-1కి ఎంపికైన ఆమె రాష్ట్రంలో ప్రీఆడిట్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి గుర్తింపు పొందారు.
ఐటీఐ కన్వీనరుగా గిరి
ఐటీఐ విద్య విజయనగరం జిల్లా కన్వీనరు, విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రధానాచార్యుడిగా టి.వి.గిరి నియమితులయ్యారు. సీతంపేట ప్రభుత్వ ఐటీఐ నుంచి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ప్రధానాచార్యులు జి.గోపాలకృష్ణ సీతంపేట వెళ్లనున్నారు. శిక్షణాధికారిగా విధులు నిర్వహించిన శ్రీనివాసరావు గాజువాక ఐటీఐకి వెళ్లగా అక్కడ పనిచేసిన జి.రామాచారి ఇటు రానున్నారు.
తూనికలు- కొలతల శాఖకు కొత్తోళ్లు..
విజయనగరం నేరవార్తావిభాగం/పట్టణం: తూనికలు- కొలతల శాఖ మూడు జిల్లాల సహాయ సంచాలకుడిగా విశాఖపట్నం నుంచి వచ్చిన జి.మధుసూదన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎన్.జనార్దనరావు కాకినాడ బదిలీ అయ్యారు. జిల్లా ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ గాజువాకకు వెళ్లగా ఆయన స్థానంలో అనకాపల్లి నుంచి వచ్చిన రంగారెడ్డి దస్త్రాలపై సంతకం చేశారు.
* నగరపాలక సంస్థ డీఈఈగా బి.రామసుబ్బారావు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలో డీఈఈగా చేస్తున్నారు.
* ప్రజారోగ్యశాఖలో పనిచేస్తున్న సీహెచ్.చంద్రమౌలికి ఆశాఖ క్యూసీ సబ్ డివిజన్ ఏఈఈగా స్థానచలనమైంది. అక్కడ పనిచేస్తున్న ఎల్.రాధను ఈయన స్థానంలో వేశారు.
* మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్లు ఎన్.శ్రీను, కె.పార్వతి విశాఖ జీవీఎంసీకి వెళ్లనుండగా.. అక్కడ నుంచి మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఎల్వీవీఎస్పీ.కుమార్ రానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
ఈ పాలనలో కోత
[ 25-04-2024]
విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)