ప్రతిభ ఉంటే.. ఉపకారం మీదే!
చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం సరోజని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం అందిస్తోంది.
దరఖాస్తుకు జూన్ 15 వరకు గడువు
పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం సరోజని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం అందిస్తోంది. కళాశాల విద్యలో సత్తా చాటేవారికి ఈ సాయం వరంలా మారనుంది. 2016లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇంటర్మీడియట్లో రెండేళ్లతో పాటు డిగ్రీలో విద్యార్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తారు.
జిల్లాలోని 52 కళాశాలల్లో..
జిల్లాలో ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 37 వరకు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ ఏడాది విద్యార్థులు 20 వేల మంది, బయట జిల్లాల్లో చదువుతున్న వారు మరో 10 వేల మంది వరకు ఉంటున్నారు. డిగ్రీ కళాశాలలు 15 ఉండగా.. వాటిల్లో 20 వేల మంది వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ చూపించే విద్యార్థులు ఉపకార వేతనం పొందొచ్చని పార్వతీపురంలోని ఎస్వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చలపతిరావు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
ఎప్పుడు చేయాలంటే....
విద్యాదాన్ ఉపకార వేతనం కోసం ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. జులై 2న ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. దరఖాస్తుదారులు పదో తరగతి మార్కుల జాబితా, పాస్పోర్టు సైజ్ ఫోటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం, చదువుతున్న కళాశాల వివరాలు పొందుపర్చాలి. ఆన్లైన్లో నమోదు చేసుకునే వారు వ్యక్తిగతంగా సొంత ఈ మెయిల్ కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం సోమవారం నుంచి శనివారం మధ్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యాదాన్.ఆంధ్ర.ఎస్డీఫౌండేషన్.ఓఆర్జీని సంప్రదించాలి.
వీరు అర్హులు.. ఈ ఉపకార వేతనం పొందాలంటే విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరంలో పది ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్ చదువుతున్న వారు అర్హులు. పదిలో కనీసం 90 శాతం మార్కులు లేదా 9 శాతం సీజీపీఏ సాధించి ఉండాలి. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు లేదా 7.5 సీజీపీఏ తప్పనిసరి.
ఎంపిక విధానం.. చదువులో చూపిన ప్రతిభ, ధ్రువపత్రంలో తెలిపిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరికి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు.
మంచి అవకాశం.. ప్రతిభ ఉండి ఉన్నత చదువులు చదవాలి అనుకునే పేద విద్యార్థులకు విద్యాదాన్ ఉపకార వేతనాలు వరం లాంటివి. ప్రతిభా వంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఆకుల రాజు, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: చంద్రబాబు
[ 24-04-2024]
జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
మావయ్యా.. మాగోడు వినవేమయ్యా!
[ 24-04-2024]
మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. -
జగనన్న ఏలుబడి.. అవస్థల అంగన్వాడీ!
[ 24-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీటికి సొంత భవనాలు సమకూరక.. రేకుల షెడ్లలో, చాలీచాలని అద్దె కొంపల్లో కొనసాగుతున్నాయి. -
ఆడబిడ్డల సింహగర్జనలో.. వైకాపా కొట్టుకుపోతుంది
[ 24-04-2024]
‘తెదేపా ఎప్పుడూ మహిళా పక్షపాతి. ఆడపిల్లల అక్షరజ్ఞానంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలికలంతా చదువుకోవాలని 8, 9, 10 తరగతుల వారికి సైకిళ్లు ఇచ్చా. -
స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేయండి
[ 24-04-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూంలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు -
జనాలు తక్కువ.. జెండాలెక్కువ
[ 24-04-2024]
విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది. -
డ్రైవర్లు... అల్లాడుతున్నారు!
[ 24-04-2024]
-
ఆర్వో కల్పనాకుమారి ఆకస్మిక బదిలీ
[ 24-04-2024]
సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె పాలకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణిగా కూడా ఉన్నారు. -
హామీల జగన్మోసం..పనులంటే నిర్లక్ష్యం!
[ 24-04-2024]
‘మేం అధికారంలోకి వస్తే మడ్డువలస జలాశయం రెండోఫేజ్ పూర్తిచేసి, 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అంటూ అయిదేళ్ల కిందట ఊదరగొట్టిన వైకాపా నేతలు ఆ సర్కారు కొలువు దీరిన తరువాత మాత్రం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది -
తెదేపాలోకి వైకాపా ఎంపీటీసీ సభ్యులు
[ 24-04-2024]
కొత్తవలసకు చెందిన పలువురు వైకాపా ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ నాయకులు తెదేపాలో చేరారు. శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు వచ్చి సిరికి రిసార్ట్స్లో... -
బి-ఫారం అందుకున్న బేబినాయన
[ 24-04-2024]
బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బేబినాయన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నుంచి బి-ఫారం అందుకున్నారు -
అన్నొస్తే.. ఇబ్బందులే
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి
[ 24-04-2024]
పుర్లి, దేవుదళ తదితర గ్రామాల్లో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ప్రచారం నిర్వహించారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్