Road Accident: తోబుట్టువులు.. తోడుగా మృత్యువు చెంతకు
వారిద్దరూ తోబుట్టువులు. వారి వివాహాలు ఒకే ముహుర్తానికి చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు. మృత్యువు మాత్రం వారి ఆశలను చిదిమేస్తూ ఒకేసారి వారిని కబళించింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి వద్ద ఆదివారం
రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి మృతి
రాకేష్, లక్ష్మీప్రసన్న
నర్సంపేట రూరల్, న్యూస్టుడే: వారిద్దరూ తోబుట్టువులు. వారి వివాహాలు ఒకే ముహుర్తానికి చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు. మృత్యువు మాత్రం వారి ఆశలను చిదిమేస్తూ ఒకేసారి వారిని కబళించింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. ఖానాపురం మండలం దబ్బీర్పేట గ్రామానికి చెందిన మొగుళ్ల రాకేష్(28), లక్ష్మీప్రసన్న(21) అన్నాచెల్లెలు. వీరి తండ్రి రమేష్ 2003లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా 2019లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి విజయ మృతిచెందింది. నాన్నమ్మ సాంబలక్ష్మి దగ్గరే వారు ఉంటున్నారు. రాకేష్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండగా లక్ష్మీప్రసన్న ఈ ఏడాది డ్రిగీ పూర్తయి ఇంటి వద్దే ఉంటుంది. అన్నాచెల్లెళ్ల వివాహాలు ఫిబ్రవరి 3న జరిపించేందుకు బంధువులు నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం దబ్బీర్పేట నుంచి ద్విచక్ర వాహనంపై రాకేష్, లక్ష్మీప్రసన్న వరంగల్కు వెళ్తున్నారు. ఒక టిప్పర్ లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పోస్టుమార్టానికి వెళ్లి మృతుల బంధువులను పరామర్శించి రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్