కిలాడి లేడి.. కిడ్నాప్ సూత్రధారి
ఆర్థికంగా స్థితివంతుడైన అతడి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి సొమ్ము చేసుకోవాలనే తలంపుతో మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేయించిన కిలా(లే)డి. ఆమె దర్శకత్వంలో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన
పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు?
నర్సంపేట, న్యూస్టుడే: ఆర్థికంగా స్థితివంతుడైన అతడి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి సొమ్ము చేసుకోవాలనే తలంపుతో మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేయించిన కిలా(లే)డి. ఆమె దర్శకత్వంలో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఉదంతం నర్సంపేట ప్రాంతంలో సంచలనం రేపింది. నర్సంపేట పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన ముత్యం శ్రీనివాస్ అనే మద్యం వ్యాపారి కిడ్నాప్నకు గురయిన విషయం విధితమే. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలో గిరిగిరి(రోజు వారీ ఫైనాన్స్)కూడా నడిపే శ్రీనివాస్కు మాధన్నపేట రోడ్డులో బజ్జీల కొట్టు నడిపే ఓ వివాహితతో పరిచయమైంది. రోజువారీ ఫైనాన్స్ తీసుకోవడంతో వాటి వసూళ్ల కోసం శ్రీనివాస్ నిత్యం ఆమె కొట్టుకు వెళ్లేవాడు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంత కాలంగా వీరి మధ్య ఏర్పడిన తగాదాలు పోలీసుస్టేషన్ వరకు వెళ్లాయి. ‘నీ కారణంగా నా భర్త మమ్ముల్ని వదిలేసి వెళ్లాడు. నా కుటుంబం ఆగమైంది మేమెలా బతకడం’ అంటూ ఆమె శ్రీనివాస్ను నిలదీయడమేగాక పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. తరువాత కొందరు పెద్దల సమక్షంలో శ్రీనివాస్ నుంచి రూ.4లక్షలు ఇప్పించి, ఇకముందు ఎలాంటి సంబంధం లేదని దస్తావేజు రాయించుకొని నోటరీ చేయించుకున్నారు. ఆయితే ఆమె అతడి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసుకునేందుకు వ్యూహం రచించింది. ఖానాపురం మండలానికి చెందిన అనిల్ అనే యువకుడితో కలిసి కిడ్నాపు పథకం వేసింది. అతడు తనకు తెలిసిన వారితో కలిసి ముఠాగా ఏర్పడి మాధన్నపేట చెరువు పెద్ద కిడ్నాప్ చేశారు. శ్రీనివాస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా గట్టిగా బంధించి ముఖానికి ముసుగువేసి కారులో తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా కిడ్నాపర్లు శ్రీనివాస్ను కొత్తగూడ మండలం గుంజేడు వైపు తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడ రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా నా వద్ద డబ్బుల్లేవు ఇవ్వనని చెప్పడంతో కొట్టడమేగాక రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతలోనే శ్రీనివాస్ చరవాణికి నర్సంపేట సీఐ, ఎస్సై నుంచి కాల్స్ వెళ్లడంతో పోలీసులకు తెలిసిందని వచ్చిన వారిలో ఇద్దరు కారు తీసుకొని వెళ్లినట్లు తెలిసింది. అనిల్, మరికొందరు బెదిరించి గుంజేడులో మహిళకు, శ్రీనివాస్కు దండలు మార్పించి మళ్లీ కారులో తీసుకొచ్చి నర్సంపేట పట్టణంలోని ఆమె అద్దె ఇంటి వద్ద దించి వెళ్లారు. కారులో పారిపోయిన ఇద్దరి వద్ద శ్రీనివాస్ చరవాణి ఉండగా తిరిగి వచ్చి ఆమె ఇంట్లో పెట్టి బయట తాళం వేసి పారిపోయారు. కాగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కిడ్నాపునకు గురైన శ్రీనివాస్ ఉన్న లొకేషన్ను గుర్తించి అతడితోపాటు కిలాడి ప్రియురాలు, మరో ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ కిడ్నాపులో మరో మహిళ ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM