జనగామకు పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానం
జనగామకు పూర్తి స్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరైంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన పూర్తిస్థాయి జిల్లా కోర్టుల ఏర్పాటుకు గతంలోనే హైకోర్టు అనుమతి మంజూరు చేయగా, తాజాగా గురువారం రాష్ట్ర
జూన్ 2న ప్రారంభం
న్యూస్టుడే, జనగామటౌన్
జనగామకు పూర్తి స్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరైంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన పూర్తిస్థాయి జిల్లా కోర్టుల ఏర్పాటుకు గతంలోనే హైకోర్టు అనుమతి మంజూరు చేయగా, తాజాగా గురువారం రాష్ట్ర హోంశాఖ కొత్త జిల్లాల వారీగా పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానాలను మంజూరు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న న్యాయస్థానమే జనగామకు కూడా జిల్లా న్యాయస్థానంగా కొనసాగింది. జనగామకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరు కావడం.. జూన్ 2 నుంచి ఇక్కడే కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
జూనియర్ సివిల్ కోర్టు నుంచి..
జనగామలో గతంలో జూనియర్ సివిల్ కోర్టు, సబ్ కోర్టు, ఏడీఎం కోర్టులు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఐదున్నరేళ్ల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జనగామ జిల్లాగా ఆవిర్భవించింది. చిన్న జిల్లాల్లో తొలుత న్యాయశాఖ పూర్తిస్థాయి జిల్లా కోర్టులను ఏర్పాటు చేయకుండా జనగామలో ఐదో అదనపు న్యాయస్థానాన్ని, ఆ తర్వాత పోక్సో కోర్టును ఏర్పాటు చేసింది. అయితే కొత్త జిల్లాల్లో కూడా పూర్తిస్థాయి జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి విన్నవించడంతో ప్రభుత్వ సూచనలు, హైకోర్టు అనుమతితో కొత్త జిల్లాల్లో కూడా పూర్తిస్థాయి జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా జ్యుడీషియల్ సేవలను విస్తరిస్తూ అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కొత్త జిల్లాల వరుసలో ఉన్న జనగామలో కూడా పూర్తిస్థాయి జిల్లా కోర్టు రానుంది.
ఉమ్మడి జిల్లా న్యాయస్థానం నుంచి కేసుల బదలాయింపు
ఇన్నాళ్లూ వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టులో జనగామ జ్యుడీషియల్ కేసులకు సంబంధించి కేసులను అక్కడి నుంచి జనగామకు బదిలీ చేయనున్నారు. ఈ నెలలోనే కేసుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయడానికి న్యాయాధికారులు చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కోర్టులు పని చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇన్నాళ్లూ జిల్లాస్థాయి కోర్టు కేసులకు దూరంగా ఉన్న వరంగల్ ఉమ్మడి కోర్టుకు పలు కేసుల నిమిత్తం తిరిగే కక్షిదారులకు ఇకపై ఊరట లభించనుంది. జనగామ జిల్లా కోర్టుకు ప్రస్తుతం ఉన్న కోర్టు సముదాయంలోనే అందుబాటులో ఉనన భవనాన్ని కేటాయించనున్నట్లు తెలిసింది. కాగా సిద్ధిపేట రోడ్డు వైపు చంపక్హిల్స్ వద్ద జిల్లా కోర్టు శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది.
న్యాయసేవల్లో పురోగతి
- కూరెళ్ల శ్రీనివాస్రెడ్డి, బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు
జనగామకు పూర్తిస్థాయి జిల్లా కోర్టు మంజూరవడం హర్షణీయం ఎంతో కాలం నుంచి కోరుతున్నట్లుగా జిల్లా కోర్టు ఏర్పాటు కానుండటంతో కక్షిదారులకు ఇక వరంగల్ ఉమ్మడి కోర్టుకు వెళ్లే వ్యయ ప్రయాసలు తప్పాయి. జిల్లా కోర్టు ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ, కుటుంబ తగాదాలు, ఇతర క్రిమినల్ కేసులను ఇక్కడే విచారించనున్నారు. జిల్లా కోర్టు ఏర్పాటు.. న్యాయసేవల్లో పురోగతిగానే చెప్పొచ్ఛు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి